• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • #KavyaMaran: సన్‌రైజర్స్‌ సంచలన విజయంతో ట్రెండింగ్‌లోకి ‘కావ్య మారన్‌’.. ఈసారి కప్‌ మనదే!

    ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఏకంగా 277/3 స్కోర్‌ చేసి ఐపీఎల్‌లో సహా ఇతర అంతర్జాతీయ టీ20 ఫార్మెట్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా రికార్డ్‌ సృష్టించింది. భారీ హిట్టింగ్స్‌తో హైదరాబాద్‌ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న క్రమంలో ఆ జట్టు యజమాని ‘కావ్యా మారన్‌’ (Kavya Maran) ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎప్పుడు … Read more

    Beautiful Cricketers Wives: ఇర్పాన్ పఠాన్ భార్యతో పాటు ఈ భారత క్రికెటర్ల భార్యలు ఎంత ఫేమస్సో తెలుసా?

    భారత మాజీ క్రికెటర్‌ ‘ఇర్ఫాన్ పఠాన్‌’ (Irfan pathan) పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా తన 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఇర్ఫాన్‌.. తొలిసారి తన భార్య ముఖాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఇర్ఫాన్‌ (#IrfanPathan) పేరు వైరల్‌ అవుతోంది. ఇర్ఫాన్‌ భార్యను తొలిసారి చూసిన వారంతా ఫీదా అవుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇర్ఫాన్‌ భార్య సఫా బేగ్ ఓ సెలబ్రిటీ అన్న విషయం చాలా మందికి … Read more

    Sania Mirza: సానియా మీర్జా – షోయాబ్‌ విడిపోవడానికి అసలు కారణం ఇదేనా?

    స్టార్‌ కపుల్స్‌ సానియా మిర్జా – షోయబ్‌ మాలిక్ జంట అధికారికంగా విడిపోయింది. ఈ జంట విడిపోతున్నట్లు గత కొన్నేళ్లుగా షికారు చేస్తున్న పుకార్లను నిజం చేస్తూ పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించడంతో పాటు వివాహ ఫొటోలను షేర్‌ చేయడంతో అవి ట్రెండింగ్‌గా మారాయి.  పాక్‌ నటి సనా జావేద్‌ను షోయాబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశాడు. గత … Read more

    Rohit sharma Net Worth 2023: రోహిత్‌ శర్మ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit sharma) ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)లో అదరగొడుతున్నాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్‌లూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో ఎప్పటికప్పుడు తనను మెరుగుపరుచుకుంటున్న రోహిత్‌.. ఆస్తుల వృద్ధిలోనూ ఏటా పైపైకి ఎగబాకుతున్నాడు. భారత్‌లోని అత్యంత సంపన్నులైన క్రీడాకారుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇంతకీ రోహిత్‌ శర్మ ఆస్తులు విలువ ఎంత? అతడికి ఎన్ని ఖరీదైన కారు ఉన్నాయి? … Read more

    Richest Cricketers 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన టాప్‌-10 క్రికెటర్లు వీరే..!

    ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉన్న క్రీడల్లో క్రికెట్‌ (Cricket) ఒకటి. ఫుట్‌బాల్ (Football) తర్వాత అత్యధిక మంది ఇష్టపడే క్రీడగా క్రికెట్‌కు పేరుంది. అందుకే క్రికెట్‌లో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉంటారు. కోట్లాది మందిని ప్రభావితం చేయగల సామర్థ్యం వారికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ కోసం వారిని బ్రాండ్ అంబాసీడర్లకు నియమించుకొని కోట్లాది రూపాయలను ముట్టచెబుతుంటాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు అత్యంత సంపన్నులుగా మారారు. ప్రపంచంలోని టాప్‌-10 రిచెస్ట్‌ క్రికెటర్లు … Read more

    ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు: జడ్డూ

    టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. మ్యాచ్‌పై నా ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే ప్రయత్నిస్తా. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోను. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. కొన్ని సార్లు మిస్‌ఫీల్డ్ కావచ్చు.. కానీ చివరి వరకు ప్రయత్నించడం మాత్రం ఆపను’. అని జడ్డూ చెప్పుకొచ్చాడు.

    నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్థిక్

    గాయం కారణంగా టీమిండియా జట్టు నుంచి వైదొలగడంపై ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం లేకపోతున్నా? జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హార్థిక్ ఆవేదనను వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

    శ్రీవారిని దర్శించిన పంత్‌, అక్షర్‌

    AP: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఈ ఇద్దరు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాంతో ఆలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    డెంగీ తర్వాత నాలుగు కేజీలు తగ్గా: గిల్

    టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్‌గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను డెంగీ నుంచి కోలుకుని వచ్చాక పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేనని తెలిపాడు. డెంగీ తర్వాత నాలుగు కేజీల బరువు తగ్గినట్లు తెలిపాడు. ‘వరల్డ్‌కప్‌లో మా బౌలర్లు బౌలింగ్‌ చేస్తున్న తీరు అద్భుతం. బుమ్రా, షమీ దెబ్బకు మా విజయం సులభం అవుతోంది. నేను మొదట్లో ఆచితూచి ఆడాల్సి వచ్చింది. బౌలర్లపై ఒత్తిడి తీసుకు రావాల్సి వచ్చింది. అందుకే, స్ట్రైక్‌ను రొటేట్‌ చేయడంపై దృష్టిసారించాం’. అని గిల్ చెప్పుకొచ్చాడు.

    ముందే సెమీస్‌కు చేరడం ఆనందం: రోహిత్

    వన్డే ప్రపంచకప్‌లో ముందే సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమ తొలి లక్ష్యం పూర్తయిందని తెలిపాడు.. ‘ఇక ముందున్న సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్‌కు చేరుకోవడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఇక ఫైనల్స్‌పైనే గురి పెడతాం’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.