• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిజమే.. నిజమే గెలుస్తుంది: అంబటి

    చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి అన్నారు. ‘నిజమే.. అందరం నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నిజం గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. గత 45 రోజుల నుంచి నిజమే గెలుస్తోంది కాబట్టే చంద్రబాబు ఇంకా జైళ్లో ఉన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు 17ఏ సాకుగా చూపి బయటపడేందుకు పాకులాడుతున్నారు అని అంబటి ఆరోపించారు.

    బీజేపీ జాబితాలో నా పేరు ఉంటుంది!: రాజాసింగ్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించబోయే లిస్ట్‌లో తన పేరు ఉంటుంది పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీ తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్‌ సర్కారు వస్తుందని అభిప్రాయపడ్డారు.

    బీజేపీ జాబితాలో నా పేరు ఉంటుంది!: రాజాసింగ్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించబోయే లిస్ట్‌లో తన పేరు ఉంటుంది పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీ తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్‌ సర్కారు వస్తుందని అభిప్రాయపడ్డారు.

    కాంగ్రెస్ బీజేపీ పోటీనే కాదు: కవిత

    ఎమ్మెల్సీ కవిత బీజేపీ, కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్‌కు పోటీనే కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు పరిశీలిస్తే.. అవన్నీ బీఆర్ఎస్ పథకాలే. తెలంగాణ ప్రజలు తెలివైనవారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలను విశ్వసించరు. ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్‌నే. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.

    కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల

    బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భార్య జమున కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈటల ప్రకటనతో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే..

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున?

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున బరిలోకి దిగుతుందనే చర్చ జరుగుతోంది. రాజేందర్ కుటుంబం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పూడూరులో నివాసం ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల విషయంలోనూ వారి కుటుంబానికి మేడ్చల్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇక్కడ టికెట్ కోసం పోటీపడుతున్న వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    వచ్చే 5 ఏళ్ల కోసం బీజేపీని ఎన్నుకోండి: అమిత్ షా

    వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆదిలాబాద్ సభలో అమిత్ షా పిలుపునిచ్చారు. ‘2014 ముందు దేశంలో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీ పైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసాం. విదేశాల్లో భారత్ … Read more

    రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే: అమిత్ షా

    డిసెంబర్ 3వ తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారంలో ఉన్నా పేదల సమస్యలు తీర్చలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని పేర్కొన్నారు. 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రావని అమిత్‌ షా స్పష్టం చేశారు.

    ఎన్నికల తేదీల విషయంలో బీజేపీ వ్యూహం..?

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే తేదీల విషయంలో సీఈసీని బీజేపీ ప్రభావితం చేసిందా అనే అనుమానం కలుగుతోందని పలువురు అంటున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం.. ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో చివరలో ఎన్నికలుండటమే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. ముందుగా తాము అధికారంలో ఉన్న చోట ఎన్నికలు పూర్తి చేస్తే ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒత్తిడి లేకుండా ప్రచారం చేసుకునేందుకే ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అలా చేస్తే పరువైనా దక్కుతుంది: హరీష్‌రావు

    బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. స్వంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని విమర్శించారు. తెలంగాణలో డిపాజిట్ల కమిటీనైనా వేసుకుంటే బీజేపీకి పరువైన దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడదని కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీష్‌రావు కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.