కవితతో నటుడు శరత్కుమార్ భేటీ
TS: ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమథువ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు శరత్ కుమార్ హైదరాబాద్కు వచ్చారు. ఈ మేరకు భారత రాష్ట్రీయ సమితి(బీఆర్ఎస్) నిజామాబాద్ ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె కల్వకుంట్ల కవితను శరత్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో వివిధ అంశాలపై వారు చర్చించారు. బీఆర్ఎస్ స్థాపన, లక్ష్యాలు, ఉద్దేశం తదితర అంశాలను శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలు, తదితర అంశాలపై సమాలోచనలు పంచుకున్నట్లు సమాచారం.