• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్‌ పోలింగ్ తేదీలో మార్పు

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో పలు మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 25కి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎధావిధిగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఎన్నికల రోజు పెద్ద సంఖ్యలో వివాహాలు/శుభకార్యాలు/ సామాజిక కార్యక్రమాలు ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బంది కలుగుతుందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు పైనే ఎక్కువ ద‌ృష్టి సారిస్తుందని విమర్శించారు. రైతులు, జవాన్ల సంక్షేమాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం గెహ్లాట్ అవినీతి బయటకు రావాలంటే రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

    చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా..?

    ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గట్టెక్కింది. సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఇందుకు ఆతిథ్యం ఇస్తోంది. వరుసగా 3 విజయాలతో చెన్నై దూకుడు మీద ఉంది. మరోవైపు, గత 2 మ్యాచుల్లో రాజస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో సొంత మైదానంలో చెన్నైపై గెలిచి తిరిగి విన్ ట్రాక్ ఎక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విన్నింగ్‌ జోన్‌లో ఉన్న … Read more

    మిగ్ 21 ప్రమాదంపై స్పందించిన ఐఏఎఫ్

    రాజస్థాన్ లోని బర్మార్ లో మిగ్-21 యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనపై భారత వైమానిక దళం(IAF) స్పందించింది. ఈ దుర్ఘటనలో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు మృతిచెందినట్లు ధృవీకరించింది. ప్రమాదం నిన్న రాత్రి 9.10గంటలకు జరిగినట్లు పేర్కొంది. ఇద్దరు యుద్ధవీరులను కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించింది. BREAKING: MiG-21 crash in Barmer, Rajasthan. Official word on pilot/s awaited from IAF shortly. pic.twitter.com/T32JaGT5QK — Livefist (@livefist) … Read more