సామాజిక మాధ్యమాల్లో త్వరగా గుర్తింపు తెచ్చుకోవటానికి కొందరు చేయని ప్రయత్నం ఉండదు. ఇటీవల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దిల్లీ మెట్రో ట్రైన్లో ఓ యువతి చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవ్వరూ లేని బోగిలో ఎక్కిన ఆమె హ్యాండ్ రెయిలర్లు పట్టుకొని ఊయల ఊగింది. యోగసనాలు చేసింది. అంతేనా కూర్చొనే సీట్లపై ఎక్కి చిందులు వేస్తూ ఇష్టమెుచ్చినట్లు వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.