• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా?: KTR

    రైతులను ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్‌ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డిలో రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు బీఆర్‌ఎస్ రైతులకు మేలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. 24 గంటల కరెంట్‌ కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయాలని కోరారు.

    స్థిరంగా పసిడి ధరలు

    దీపావళి నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5655, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6169గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5700 (22 క్యారెట్స్), రూ. 6218 (24 క్యారెట్స్)గా ఉన్నాయి.నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు.

    అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా?: విజయశాంతి

    మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని సినీనటి విజయశాంతి అన్నారు. గతంలో కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబితే బీజేపీలోకి వెళ్లానని చెప్పారు. కానీ కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ను తొలగించవద్దని కోరామని చెప్పారు. సంజయ్‌ను తొలగించడంతో బీజేపీ పరువు పోయిందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

    ఆర్య తొలి వెబ్‌సిరీస్.. ఉత్కంఠగా ట్రైలర్

    హీరో ఆర్మ వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యాడు. ఆయన నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’ ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అడవి సమీపంలో ఉన్న తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు? అన్నది ఈ సిరీస్‌ స్టోరిగా ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది

    ‘ఉయ్యాలో ఉయ్యాలా..’ ఫుల్‌ వీడియో రీలీజ్..!

    నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం సూపర్‌హిట్‌ సాధించిన విషయం తెలిసిందే.. ఈ మూవీకి అనిల్‌ రావిపూడి దర్శకుడిగా వ్యవహిరించాడు. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాట ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

    రాజకీయ నాయకుడి గెటప్‌లో హీరో నాని

    హీరో నాని తాజాగా ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్న ఫొటోను ఆయన షేర్‌ చేశాడు. నాని నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పోస్ట్ పెట్టాడు. డిసెంబర్‌ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని క్యాప్షన్‌‌తో నానీ షేర్ చేశాడు.. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. ‘సినిమా ప్రమోషన్స్‌ను మీరు ప్రత్యేకంగా చేస్తారు’ అంటూ పొగిడేస్తున్నారు.

    దక్షణ గాజా నుంచి పారిపోండి: ఇజ్రాయెల్

    పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి పారిపోవాలని ఇజ్రయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌ పౌరులు తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ‘ప్రస్తుత పరిస్థితిల్లో ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. అయితే, ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం’ అని ఇజ్రాయెల్‌ పేర్కొంది.

    అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

    అమెరికా లో మళ్లీ కాల్పుల మోత కలకలం రేపింది. న్యూ హంప్‌షైర్‌లో ఉన్న సైకియాట్రిక్‌ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. పోలీసుల కాల్పుల్లో అనుమానిత వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన ఆసుపత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

    ‘జట్టును గెలిపించడం రోహిత్‌కు తెలుసు’

    భారత్, ఆసీస్‌ రేపు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ‘అతడు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ఎన్నోసార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉంది. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసు’. అని జహీర్ చెప్పుకొచ్చాడు.

    Video: థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌

    బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌-కత్రినా ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి సందడి చేశారు. ‘టైగర్‌-3’ విడుదలైన సూపర్ హిట్‌ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్‌ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. Vibe 🔛#Tiger3InCinemas | #LekePrabhuKaNaam pic.twitter.com/o4UQwI0PXO — Yash Raj Films (@yrf) … Read more