• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 66,325 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,792 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22 వద్ద ప్రారంభమైంది.

    స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 66,213 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 11 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,740 పాయింట్ల వద్ద కదలాడుతోంది. HCL టెక్, ONGC, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

    జియో నుంచి మరో కొత్త ఫోన్‌

    రిలయన్స్‌ జియో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. జియోభారత్‌ బీ1 పేరిట దీన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నఫోన్ కంటే అదనపు ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని లిస్ట్‌ చేశారు. బీ1 ఫోన్‌ ధర రూ.1299. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో జియో యాప్స్‌ అన్నీ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే కూడా ఉన్నట్లు వెల్లడించింది.

    అంబానీ @రూ.8.08 లక్షల కోట్లు

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.8.08 లక్షల కోట్ల సంపదతో దేశంలోని కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెందగా.. గౌతమ్ అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. దేశంలోని 138 నగరాల నుంచి 1319 మంది బిలియనీర్లకు హురున్ జాబితాలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఈ జాబితాలో ఉండగా.. వీరి సంపద రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది.

    ఏదీ ఊరికే రాదు: ఆనంద్ ట్వీట్

    ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియా షేర్ చేశారు. అందులో జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడవచ్చు.. దీనిపై ఆనంద్ స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘నీరజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందంటే అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదల వల్లే అతడు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టే ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే’ అంటూ మోటివేషన్ ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా … Read more

    ఐటీ ఉద్యోగులకు మరో ఏడాది నిరాశే

    ఐటీ రంగానికి సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఐటీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 2024లో సైతం ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌కు చెందిన విశ్లేషకులు వెల్లడించారు. అయితే 2025లో మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు 2024ని ‘వాష్ అవుట్’గా పేర్కొంటారని, ఇక 2025పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగితే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్చరించాయి.

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

    వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రెపో రేటు: 6.5%, రివర్స్ రెపో రేటు: 3.35%, ఎస్‌డీఎఫ్‌ఆర్: 6.25%, ఎమ్ఎస్ఎఫ్ఆర్:6.75%, బ్యాంక్ రేటు: 6.75% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి రేటు బాగానే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.

    లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    వరుసగా మూడు రోజులు నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 327 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 65,553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ సూచీ 19,526 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 65,129 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 108 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,420 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతోంది.

    నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సూచీ 65,156 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 104 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,533 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఏషియన్ పేయింట్ల్, బజాజ్ ఫైనాన్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, రిలయన్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షెర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగింది. రూ.83.21 వద్ద కొనసాగుతోంది.