• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేటి ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 395 పాయింట్ల లాభంతో 64,759 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 19,352 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రెడవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ లాభాల్లో ఉన్నాయి.

    ముకేశ్‌ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్‌

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు పేర్కొన్నాడు. అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న ఈ రెండు మెయిల్స్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేశ్‌ అంబానీని చంపేస్తామని మెయిల్‌లో నిందితుడు పేర్కొన్నాడు. ముకేశ్ మెయిల్స్‌కు స్పందించకపోవడంతో దుండగుడు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడని పోలీసులు తెలిపారు. © ANI Photo © ANI Photo © ANI Photo

    జియో వరల్డ్‌ ఈవెంట్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

    ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన జియో వరల్డ్ గార్డెన్ పక్కన జియో వరల్డ్‌ ప్లాజా రిటైల్‌ మాల్‌ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో నిర్మించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్‌ వస్త్రాల్లో మెరిశారు. Screengrab Instagram: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    లాభాలల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 378 పాయింట్ల లాభంతో 64,459 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 19,245 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501 పాయింట్ల లాభంతో 64,092 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 19,142 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 83.20 దగ్గర ప్రారంభమైంది.

    నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ నష్టాలతోనే ప్రారంభమైయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 63,847 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,075 దగ్గర కొనసాగుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాలో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉదయం పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు మరింత కిందకు దిగజారాయి. ఉదయం సెన్సెక్స్‌ 64,449.65 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 237.72 పాయింట్ల నష్టంతో 63,874.93 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,232.95 దగ్గర ప్రారంభమై చివరకు 61.30 పాయింట్లు నష్టపోయి 19,079.60 దగ్గర ముగిసింది. .

    Stock Market: రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,885.56 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 329.85 పాయింట్ల లాభంతో 64,112.65 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,053.40 దగ్గర ప్రారంభమై 93.65 పాయింట్లు లాభపడి 19,140.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.

    నష్టాలకు బ్రేక్‌ పంజుకున్న స్టాక్ మార్కెట్లు

    గత ఆరు రోజుల నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లు నేడు బలంగా పుంజుకున్నాయి. ఉదయం నుంచి లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఈ రోజంతా అదే జోరును కొనసాగింది. దేశియంగా కార్పొరేట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. ఉదయం సెన్సెక్స్‌ 63,559.32 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 634.65 పాయింట్ల లాభంతో 63,782.80 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,928.75 దగ్గర ప్రారంభమై 190 పాయింట్లు లాభపడి 19,047.25 దగ్గర ముగిసింది.

    భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయమే భారీ పతనంతో మొదలై అదే ట్రెండ్ కనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,774.16 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 900.91 పాయింట్ల నష్టంతో 63,148.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,027.25 దగ్గర ప్రారంభమై 259.20 పాయింట్లు నష్టపోయి 18,862.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 వద్ద నిలిచింది.