• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మందు తాగండి.. నీటిని మిగల్చండి’

    వివాదాస్పద వ్యాఖ్యలతో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆ రాష్ట్ర ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నీటిని సంరక్షించాలంటే వినియోగాన్ని తగ్గించాలని చెబుతూనే.. దానికి బదులుగా మద్యం సేవించాలని ఎంపీ జనార్ధన్ మిశ్రా సూచించారు. ‘నీళ్లు లేక భూములు వట్టిపోతున్నాయి. నీటిని సంరక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అవసరమైతే మందు తాగండి. ధూమపానం చేయండి. ఏదైనా కానివ్వండి. కానీ, నీటిని మాత్రం వృథా చేయొద్దు. జల ప్రాముఖ్యతను ఇప్పటికైనా గుర్తించండి’ అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv