• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరాకాష్టకు చేరుకున్న ప్రీ వెడ్డింగ్ సరసాలు.. ఆసుపత్రి పాలయిన యువ జంట..

    ప్రీ వెడ్డింగ్ షూట్స్.. పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ పదాలు బాగా వినబడుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తున్న యువత తమ చేతిలో డబ్బులు లేకున్నా కానీ అనవసర ఆర్భాటాలకు పోతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటోంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల సరదాల వలన ఇప్పటికే అనేక మంది ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూశాం. అయినా కానీ యువతరం మాత్రం మారడం లేదు. ఎంత మందికి ఏమయినా పర్వాలేదు.. తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తున్నారు. ఇలానే నగరానికి చెందిన అనురాగ్ రెడ్డి, శివాణి అనే సాఫ్ట్ వేర్ జంటకు పెళ్లి కుదిరింది. వీరు ఎల్‌బీ నగర్‌లోని రాక్ టౌన్ కాలనీలో ఉంటున్నారు. వీరు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని అంబర్‌పేట్ దగ్గర్లో ఉన్న కోహెడ గుట్ట మీదికి వెళ్లారు. ఎఫెక్ట్స్ కోసం పొగ పెట్టగా అక్కడే ఉన్న తేనే తుట్టె ఒక్కసారిగా లేచి వీరి మీద దాడి చేసింది. ఈ దాడిలో వారిద్దరూ గాయపడ్డారు. గుట్ట మీద ఆలయం ఉండగా.. దానిలోకి వెళ్లి తలదాచుకున్నా కానీ తేనేటీగలు తగ్గేదేలే అంటూ తమ ప్రతాపాన్ని చూపెట్టాయి. దీంతో వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv