• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పీవీ సింధును కలిసిన వాలీబాల్ ప్లేయర్ డేవిడ్ లీ.. హైదరాబాద్ వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్

    ప్రతిష్ఠాత్మక క్రీడా సంబరానికి హైదరాబాద్ వేదికగా మారనుంది. దేశవ్యాప్తంగా 7 నగరాల నుంచి పాల్గొనే జట్లతో ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ క్రీడాకారులు పాల్గొనే ఈ లీగ్‌ను ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. 

    పాల్గొనే జట్లు ఇవే..

    1. హైదరాబాద్ బ్లాక్ హక్స్
    2. కాలికట్ హీరోస్
    3. కొచ్చి బ్లూ స్పైకర్స్
    4. అహ్మదాబాద్ డిఫెండర్స్
    5. చెన్నై బ్లిట్జ్
    6. బెంగళూరు ట్రొపేడోస్
    7. కోల్‌కత్తా థండర్ బోల్ట్స్

    మ్యాచులు ఎక్కడ వీక్షించాలి?

    మొత్తం 23 రోజుల పాటు జరిగే 24 మ్యాచులను సోనీ టెన్ 1(ఇంగ్లీష్), సోనీ టెన్ 2(హిందీ), సోనీ టెన్ 4(తమిళ్& తెలుగు), సోనీ టెన్ 2(మలయాళం) ఛానళ్లలో వీక్షించవచ్చు. హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌ను కొచ్చితో తలపడనుంది.

    ప్రపంచ ఆటగాడి అభిప్రాయం ఇది

    అమెరికాకు చెందిన స్టార్ వాలీబాల్ ప్లేయర్ డేవిడ్ లీ ఈ టోర్నీలో కాలికట్ హీరోస్ జట్టు తరఫున పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని.. అనేక మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఎదిగారని పేర్కొన్నాడు. అలాగే వాలీబాల్ చాలా స్కిల్ ఉన్న గేమ్ అని.. ఈ ఆట చాలా ఎగ్జైట్‌మెంట్‌ని ఇస్తుందని పేర్కొన్నాడు.

    పీవీ సింధుతో భేటీ

    టోర్నీకి ముందు ఇతడు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో భేటీ అయ్యాడు. మేం ఈ భేటీలో ఒలింపిక్స్ గురించి చర్చించామని.. పీవీ సింధు చాలా టాలెంటెడ్ అని లీ పేర్కొన్నాడు. అలాగే ఇదివరకే మేమిద్దరం స్నేహపూర్వక వాతావరణంలో మూడుసార్లు సమావేశమయ్యామని వివరించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv