గంజాయికి బానిసై.. ఆత్మహత్య
హైదరాబాద్- తిరుమలగిరిలో దారుణం జరిగింది. గంజాయికి బానిసై కెవిన్ అనే యువకుడు సెరినిటీ ఫౌండేషన్ రీహబిలిటేషన్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కెవిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కెవిన్ జనవరి 26న ఆత్మహత్య చేసుకున్నాడాని సిబ్బంది చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.