కరోనా సమయంలో ఎంతోమందికి బాసటగా నిలిచి ఆదర్శప్రాయుడయ్యారు నటుడు సోనూ సూద్. అయితే, భారతీయ రైల్వేకు ఓ విషయంలో సోనూ సూద్ క్షమాపణలు చెప్పారు. రైలులో మెట్లపై కూర్చుని ప్రయాణిస్తున్న [వీడియో](url) ఆధారంగా.. రైల్వే శాక సోనూ సూద్ని మందలించింది. ‘సోనూ గారూ, మీరు ఎందరికో ఆదర్శప్రాయులు. అలా మెట్లపై కూర్చిన ప్రయాణించడం ప్రమాదకరం. దీనివల్ల తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అని ట్విటర్లో పోస్ట్ చేయగా.. రైల్వేకు క్షమాపణలు చెబుతూ సోనూ సూద్ బదులిచ్చారు. ‘ఎంతో మంది పేదల బతుకులు ఈ డోర్ నుంచే బలైపోతాయని ఆలోచిస్తూ ఊరికే అలా కూర్చున్నా. భారతీయ రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.