• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీని అమ్మేద్దామని చూస్తున్నారు: కన్నా

    ఏపీని కేసీఆర్‌కు జగన్ అమ్మేద్దామకుంన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ ప్రజల్ని మోసం చేసి గెలిచారని ఆరోపించారు. ప్రజలు మోసాన్ని గమనించారనే ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీ ఆస్తులు పోగొట్టారని చెప్పారు.. ఈ సారి రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నారని కన్నా విమర్శించారు.

    నేడు రైతు భరోసా నిధులు విడుదల

    నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏడాదిలో రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది.

    జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు: లోకేష్

    ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం… జగన్ జమానాలో దళితులపై అణచివేత … Read more

    ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

    ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

    జగన్‌పై సుప్రీంకు వెళ్లిన వైకాపా ఎంపీ

    AP: సీఎం జగన్‌ కేసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ‘జగన్‌ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేయడంతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    నేడు ‘వైఎస్సార్‌’ అవార్డుల ప్రదానోత్సవం

    నేడు ఏపీప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. దీనికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా, సీఎం జగన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లంభించనున్నాయి.

    రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా

    రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ.. ‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’.అని జగన్ పేర్కొన్నారు.

    ప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ

    AP: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన రైలు ప్రమాద ఫొటోలను సీఎం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఘటనాస్థలిని పరిశీలించాలని జగన్ భావించినప్పటికీ ట్రాక్‌ పనురుద్ధరణ పనుల రిత్యా వీలు పడలేదు. దీంతో జగన్‌ నేరుగా ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల్లో స్థైర్యాన్ని నింపారు. #WATCH | Andhra Pradesh CM YS Jagan … Read more

    రైలు ప్రమాద స్థలికి సీఎం జగన్

    AP: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఘటనాస్థలికి సీఎం జగన్‌ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. విమానంలో తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లనున్న జగన్‌, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అలమండ వెళ్తారు. అలమండ నుంచి ప్రత్యేక రైలులో వెళ్లి ప్రమాదస్థలిని పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను జగన్‌ పరామర్శిస్తారు.

    ఏపీ.. ఫ్యాక్షన్‌ ప్రదేశ్‌గా మారింది: లోకేశ్

    AP: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వైకాపా అధినేత తన సొంత బాబాయ్‌ వేసేస్తే.. ఆయన ఫ్యాన్స్‌ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఆరోపించారు. అడ్డంగా ఉన్న బైక్ తీయాల‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ బీఆర్ సింగ్ హార‌న్ కొట్టడ‌మే నేర‌మైందన్నారు. న‌డిరోడ్డుపై వైకాపా నేత‌లు గూండాల కంటే ఘోరంగా డ్రైవర్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ వల్ల ఆంధ్రప్రదేశ్‌.. ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు.