• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు బోల్తా 22 మందికి గాయాలు

    AP: చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది, ప్రైవేటు బస్సు బోల్తా 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు తీవ్రంగా గాయపడ్డారు.మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    లోయలో బస్సు పడి 18మంది మృతి

    మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి. ప్రయాణ సమయంలో బస్సులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారట. అతివేగంతో వస్తున్న బస్సు మూల మలుపు వద్ద టర్న్ తీసుకుంటుండగా ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 131 అడుగుల లోతులో బస్సు పడిపోయిందని, సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతున్నట్లు మెక్సికో ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ?Autobús de pasajeros cayó aun profundo barranco, de … Read more

    తెల్లవారుజామున ఘోర విషాదం

    మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in … Read more

    సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం; 20 మంది అక్కడికక్కడే..

    [వీడియో; ](url)సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. యాసిర్ ప్రావిన్స్‌లోని అక్వాబా షార్ వద్ద హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు వేగంగా వెళ్తూ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు రాలేక 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 29 మంది గాయాల పాలయ్యారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ?? A bus carrying pilgrims from Umrah … Read more

    బస్సు బోల్తా.. 15మంది మృతి

    మణిపూర్‌లో బస్సు బోల్తా పడి 15 మంది విద్యార్థులు మృతిచెందారు. నోనీ జిల్లాలో స్టడీ టూర్ కోసం వెళ్లిన విద్యార్థుల యాత్ర విషాదయాత్రగా మారింది. రెండు బస్సుల్లో విద్యార్థులు బయల్దేరారు. ఈ క్రమంలో అమ్మాయిలు ప్రయాణిస్తున్న బస్సు మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి ఎస్డీఆర్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం బిరేన్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. … Read more

    ఘోరం.. 17మంది సజీవదహనం

    వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను విధి వంచించింది. బస్సులో వేరే ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం బారిన పడి 17మంది సజీవదహనమయ్యారు. పాకిస్థాన్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ‘బస్సుకు వెనకాల మంటలు అంటుకున్నాయి. అప్పుడు బస్సులో 35మంది ఉన్నారు. భయంతో కొంతమంది దూకేశారు. 10మందికి గాయాలయ్యాయి. పునరావాస కేంద్రం నుంచి సొంత జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది’ అని పోలీసులు తెలిపారు. ఆగస్టులో కూడా పంజాబ్ రాష్ట్రంలో బస్సు దగ్ధమై 20మంది సజీవదహనం కావడం గమనార్హం. BREAKING ?? : At … Read more