• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రమాదంపై సీఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి

    HYD: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు గవర్నర్‌ సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపిన కేసీఆర్‌ గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

    కేసీఆర్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    TG: సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు), రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు (ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు) ఉన్నాయని ప్రకటించారు. తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు లేవని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లు అని … Read more

    సీఎం కేసీఆర్‌కు పవన్‌ చురకలు

    TG: సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు. నాలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ’ అని పవన్‌ అన్నారు.

    డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు: కేసీఆర్‌

    TG: డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని భారాస అధినేత కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. చెన్నూరు సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణ రాకముందు.. వచ్చాక.. రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని ప్రజలు గమనించాలి.. ఆలోచించాలి. ఆ తర్వాతనే ఓటు వేయాలి’ అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

    అందుకే కేసీఆర్‌‌పై పోటీ: ఈటల

    బీఆర్‌ఎస్ నేతలకే ‘బీసీ బంధు’ దక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పాలనలో దళితులు, బీసీలు, సంతోషంగా లేరు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అంటున్నారు. అయితే తానుందుకు సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తాను. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం బీజేపీకే సాధ్యం. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలి’. అని ఈటల పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్

    TG: కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ‌మైన సంస్కృతి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. క‌త్తుల‌తో దాడులు చేసి భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిర్మ‌ల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘పదేళ్ల భారాస పాలనలో క‌ర్ఫ్యూ లేదు. మ‌త‌క‌ల్లోలం లేదు. కానీ కాంగ్రెస్ నేతలు క‌త్తులు ప‌ట్టి దాడులు చేస్తున్నారు. మొన్న దుబ్బాక అభ్య‌ర్థిని కత్తితో పొడిచారు. దేవుడి ద‌య వ‌ల్ల ప్రాణ‌పాయం త‌ప్పింది. కాంగ్రెస్ పార్టీది ఇంత దుర్మార్గ‌మైన సంస్కృతి’ అని మండిపడ్డారు.

    కల్వకుంట్ల ‘స్కా.. మేశ్వరం: రేవంత్ విమర్శ

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలు రాయి. నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం..అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు..రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగుకోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు.. ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం..మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి’. అని రేవంత్ ఆరోపించారు.

    ‘KCR దోచుకున్నదంతా పేదలకు పంచుతాం’

    TG: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపించారు. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు. కేసీఆర్ దొచుకున్నదంతా వసూలు చేసి ప్రజలకు పంచిపెడతామని రాహుల్‌ హామి ఇచ్చారు. రాష్ట్రంలో యుద్ధం మెుదలైందన్న రాహుల్‌.. దీనిని దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

    సీఎం కేసీఆర్‌ నేటి నుంచి రాజశ్యామల యాగం

    సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరత రాష్ట్రాలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గోననున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పం, రెండోరోజు వేదపారాయణలు, చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది.

    తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నాం: కేసీఆర్

    తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాడలేదని విమర్శించారు. ఆ పార్టీ వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వారికున్న దృక్పథం ఏంటనేది ప్రజలు ఆలోచించాలన్నారు. దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.