కేసీఆర్ అబద్ధాలకోరు: కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి విమర్శలు గుప్పించారు. కేసీఆర్, ఆయన ప్రభుత్వం అబద్ధాలతో నడుస్తోందని అన్నారు. కేసీఆర్ అబద్ధాలకోరు అంటూ విమర్శించారు. భారత రాష్ట్ర సమితిని కూడా అసత్యాలతో నడపాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు విసిగిపోయారని… త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నాందేడ్లో సభ నిర్వహించిన భారాస అధినేత… మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.