• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేం దాడులు చేస్తే ఎవరూ మిగలరు: కేసీఆర్

    బీఆర్‌ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి‌పై దాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. రాష్ట్రంలో చేతగాని ప్రతిపక్ష దద్ధమ్మ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ‘చేతగాని దద్ధమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు. కత్తి పొటు పొడవాలంటే మాకు చేతులు లేవా..? మొండి కత్తి మాకూ దొరకదా..? మాకూ దమ్ముంది మేం దాడులు చేస్తే ఎవరూ మిగలరు. ఎన్నికలు ఎదుర్కోలేక హింసకు పాల్పడుతున్నారు’. కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఆగమాగం కావద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్

    తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాల మాటలు విని ఆగమాగం కాకుండా విచక్షణతో ప్రజలు ఓటు వేయండి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కరెంటులేని పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో తప్పా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి … Read more

    కూసే గాడిద వచ్చి మేసే గాడిదను తిట్టినట్టు: కేసీఆర్

    ఆలేరులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారు. కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారు.. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తా.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు’ … Read more

    కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం రాజీనామా

    కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కేటీఆర్ సమక్షంలో ఈరోజు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ స్వయంగా నాగం ఇంటికి వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నాగంకు నిరాశ ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

    ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి: కేసీఆర్

    కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలి. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తం. పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుంది. తెలంగాణ రాక ముందు సాగర్‌ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారు. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చాం.. నాగార్జున సాగర్‌ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్‌మాల్‌ చేసి దిగువన … Read more

    బస్సు రెడీగా ఉంది కేటీఆర్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి

    కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. ‘కర్ణాటకలో హామీలన్నీ అమలు అవుతున్నాయి. వాటిపై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్ తోక ముడిచారు. బస్సు రెడీగా ఉంది, ప్రగతి భవన్ రావాలా, ఫాం హౌస్‌కు రమ్మంటావా.. బస్సులో నేరుగా కాళేశ్వరం వెళ్లి చూద్దాం.. అక్కడి నుండి కర్ణాటకకు వెళ్దాం, సిద్ధమా? అని ప్రశ్నించారు.

    ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చురకలు

    ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు చురకలంటించారు. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు కొందరు నేతలు ఎవరి కాళ్లదగ్గర ఉన్నారని విమర్శించారు. ‘పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొడంగల్‌ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసింది. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు’. అని … Read more

    నేడు వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటన

    TG: సీఎం కేసీఆర్ నేడు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ వెంటనే నాగర్‌కర్నూల్‌తో పాటు వనపర్తి నియోజకవర్గంలోనూ సభకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్‌ సభకు భారీగా జనసమీకరణను కూడగట్టేందుకు గులాబీ దళాలు ప్రయత్నిస్తున్నాయి.

    రాష్ట్రానికి గుదిబండలా కాళేశ్వరం: భట్టీ

    TG: సీఎం కేసీఆర్‌ చేసిన రీడిజైనింగ్‌ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోయిందని విమర్శించారు. డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్‌ ఇప్పుడెందుకు మాట్లాడరని భట్టి ప్రశ్నించారు. గతేడాది వరదల్లో పంపుహౌసులు మునిగి భారీగా నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు. రూ.30వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఎలా ఖర్చు చేశారని భట్టి నిలదీశారు.

    నేడు హైకోర్టు జడ్జిల ప్రమాణం

    నేడు హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌తో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.