పాకిస్తాన్కు భారత్ నోటీసులు; పాక్ మొండి వైఖరి
సింధు నదీ జలాల పంపకం విషయంలో పాకిస్తాన్కు భారత్ నోటీసులు పంపింది. పాకిస్తాన్ మొండి వైఖరి కారణంగానే ఈ నోటీసులు పంపినట్లు ఇండియా పేర్కొంది. ఈ నోటీసుతో 3 నెలల్లోగా భారత్-పాక్లు చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లుగా కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల సమస్యలు చర్చించేందుకు పాక్ చర్చలకు నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ నోటీసులు పంపింది. కాగా 1960లో నెహ్రూ-ఆయూబ్ ఖాన్ల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది.