• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అహ్మదాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న ఈ రెండు జట్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. మరోవైపు.. భారత్, ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ముగించుకున్న తర్వాత అహ్మదాబాద్‌కు పయనం కానుంది.

    Pak Vs Ned: పాకిస్థాన్ విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌‌తో నెదర్లాండ్స్ తలపడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. బాస్ డి లీడ్ (67), విక్రమ్ జిత్ సింగ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు.

    Pak Vs Ned: పాకిస్థాన్ విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌‌తో నెదర్లాండ్స్ తలపడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. బాస్ డి లీడ్ (67), విక్రమ్ జిత్ సింగ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు.

    Asian Games: భారత్‌తో అఫ్గాన్ ఫైనల్ పోరు

    ఆసియా క్రీడల్లో భాగంగా నేడు రెండో సెమీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టును అఫ్గానిస్థాన్ ఓడించింది. ఈ క్రమంలో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 115 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన అఫ్గాన్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్-పాక్ పోరును చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ తలపడనుంది.

    అంజూ కేసులో మరో ట్విస్ట్

    ఫేస్‌బుక్ ప్రేమతో పాకిస్తాన్ వెళ్లిపోయిన భారత యువతి అంజూ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఆమె పాక్ యువకుడు నుస్రుత్ ఖాన్‌ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరును కూడా ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో నిఖా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంజూ-నస్రూమ్‌లు కలసి సన్నిహితంగా మెలుగుతూ విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nasrullah & Anju Love StoryIndia's Anju 'feels safe' in Pakistan#AnjuinPakistan #SeemaHaidar … Read more

    పాక్‌లోనే ఆసియా కప్; భారత్ మాత్రం..

    పాకిస్తాన్‌లోనే ఆసియా కప్ జరుగుతుందని ఏసీసీ స్పష్టం చేసింది. ‘‘టీమిండియా ఆసియా కప్ ఆడుతుంది. ఆసియా కప్ పాక్‌లోనే జరుగుతుంది. కానీ తటస్థ వేదికలపై మాత్రమే భారత్ ఆడుతుంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ, ఇంగ్లండ్ వేదికలు సూచించాం. ఈ వేదికల్లో ఎక్కడో ఒక చోట భారత్ తన మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక వేళ భారత్ ఫైనల్ చేరినా.. ఫైనల్ కూడా తటస్థ వేదికలోనే జరుపుతాం. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించింది. ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహిస్తాం.’’ అంటూ ఏసీసీ పేర్కొంది. ప్రపంచకప్ సమరాల … Read more

    దివాళా తీసేసిన పాకిస్తాన్; ఒప్పుకున్న ఆ దేశ రక్షణ మంత్రి

    [వీడియో;](url) తమ దేశం ఎప్పుడో దివాళా తీసిందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని, ఎలా కోలుకోవాలో తెలియడం లేదని చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఐఎంఎఫ్ దగ్గర సరైన పరిష్కారం ఉండదని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి రాజకీయ నాయకులు, అధికారులే కారణమని ఆయన కుండ బద్దలు కొట్టారు. తమ దేశంలో చట్టాలను, రాజ్యాంగాన్ని ఎవరూ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. Defence Minister of Imported govt admits that Pakistan … Read more

    పెషావర్ బాంబు దాడి; 83కు చేరిన మృతులు

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో జరిగిన [బాంబు పేలుడు](url) ఘటనలో ఇప్పటివరకు 83 మంది మరణించారు. 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా సోమవారం పెషావర్‌లోని ఓ మసీదులో పీటీఐ ఉగ్రవాదులు బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మసీదు పైకప్పు కుప్పకూలిపోయింది. దీంతో శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. వారందరూ విగతజీవులుగా మారుతున్నారు. కాగా క్షతగాత్రులకు రక్తదానం చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. Saddened to see this……More than 50 killed in … Read more

    ఇంటర్ పరీక్షల్లో ప్రముఖ సింగర్ పాటలు; వీడియో వైరల్

    పాకిస్తాన్‌కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి పరీక్షలో జవాబులకు బదులుగా సినిమా పాటలు రాశాడు. ఇందుకు సంబంధించిన పరీక్షా పేపర్లు వైరల్‌గా మారాయి. ఓ విద్యార్థి ప్రముఖ సింగర్ అలీ జాఫర్ పాడిన ‘ఝూమ్’ పాటలను ఫిజిక్స్ పేపర్లో జవాబులుగా రాశాడు. ఇన్విజిలేటర్ గమనించి పేపర్లన్నింటినీ [వీడియో](url) తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అలీ జాఫర్ స్పందించాడు. ‘‘ఫిజిక్స్ అన్ని చోట్లా ఉంటుంది. అలాగే నా పాటల్లో కూడా ఉంటుంది.’’ అంటూ చమత్కరించాడు. یہ وائرل وڈیو وٹسُ … Read more

    ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్; పాక్‌లో దుర్భర పరిస్థితులు

    పాకిస్తాన్‌లో ఆర్థికమాంద్యం తలెత్తడంతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ దేశ ప్రజలు వంట గ్యాస్‌ను పెద్ద పెద్ద [ప్లాస్టిక్ కవర్ల](url)లో నిల్వ చేసుకుంటున్నారు. వాటికి లీకేజీ లేకుండా నాజల్, వాల్వ్ ఏర్పాటు చేశారు. ఈ కవర్లలో దేశ గ్యాస్ పైప్‌లైన్ వద్ద 5 కేజీల గ్యాస్ నింపడానికి గంట సమయం పడుతోంది. వీటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. In #Pakistan, gas packed in … Read more