మోదీ వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి
ఇజ్రాయెల్-పాలస్తీనాల సంక్షోభంపై భారత వైఖరిని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీరు మొదటి నుంచి భిన్నంగా ఉందని చెప్పింది.‘పాలస్తీనా హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతుగా నిలిచేది. దాడుల విషయానికొస్తే వాటిని తీవ్రంగా ఖండించేంది. ప్రస్తుతం భారత వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంపై భారత్ తన వైఖరిని హుందాగా, గౌరవప్రదమైన రీతిలో వెల్లడించాలి’అని కాంగ్రెస్ పేర్కొంది.