• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇజ్రాయెల్‌‌కు అండగా ఉంటాం: మోదీ

    ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ పౌరుల మృతిపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి లోనయ్యా ఈ విపత్కర పరిస్థితిల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతాం, అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో మిలిటెంట్ల హింసాత్మక దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    రాహుల్‌‌ గాంధీని రావణుడితో పోల్చిన బీజేపీ

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ రాహుల్ ఫొటో కింద క్యాప్షన్‌తో బీజేపీ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ‘మోదీ ఒక అబద్ధాల కోరు ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదు’ … Read more

    మోదీపై పుతిన్ ప్రశంసలు

    ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ఎన్నో విజయాల సాధించిందన్నారు. మోదీ ప్రారంభించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను పుతిన్‌ మెచ్చుకొన్నారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భారత్‌ అనుసరిస్తున్న విధానం ఆదర్శమని పుతిన్ చెప్పుకొచ్చారు. భారత్-రష్యా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు పైనే ఎక్కువ ద‌ృష్టి సారిస్తుందని విమర్శించారు. రైతులు, జవాన్ల సంక్షేమాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం గెహ్లాట్ అవినీతి బయటకు రావాలంటే రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

    పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం?

    ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల ప్రధాని ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండటంతో కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. నిన్నటి వరకు హైదరాబాద్‌లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి రాత్రి ఫోన్ రావటంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.

    నిజమై తప్పక ఉండి ఉంటది: విజయశాంతి

    ఎన్డీఏలో చేరుతానని తనతో కేసీఆర్ చెప్పారన్న మోదీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ.. విజయశాంతి ఆయన వ్యాఖ్యలను సమర్థించింది. “ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు. నిజమై తప్పక ఉండి ఉంటది. 2009లో కూడా తెలంగాణలో మహాకూటమి పేర కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానాలో ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకం ఉంది. కేటీఆర్ ఈ విషయంలో మోదీని తిట్టటం సరికాదు” అని చెప్పారు.

    ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్

    ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మోదీకి ఛాలెంజ్ చేస్తున్న.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే. ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్‌కు లేదు.. ఎన్డీఏలో చేరేందుకు మాకు పిచ్చి కుక్క కరవలేదు. మేం కర్ణాటకలో డబ్బులు పంచితే మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

    మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR

    ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రధాని మోదీ మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…?1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు. 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?? మీ మనసు … Read more

    కేసీఆర్ ఎన్డీయేలో చేరుతామన్నారు: మోదీ

    నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ఎన్టీయేలో చేరుతామని తనను ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు. అయితే తాము బీఆర్‌ఎస్‌తో పొత్తును తిరస్కరించామని చెప్పారు. GHMC ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్ర సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందని మోదీ విమర్శించారు.

    కాంగ్రెస్‌ను నడిపేది దేశ వ్యతిరేక శక్తులు: మోదీ

    ఛత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ ఫైరయ్యారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు అధికంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను నడుపుతోంది ఆ పార్టీ నేతలు కాదని దేశ వ్యతిరేక శక్తులతో అనుబంధం ఉన్నవారు నడుపుతున్నారని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో గతంలో బీజేపీ ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్యశాఖ ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.