• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    24 గంటల్లో రూ. 42 కోట్లు సీజ్

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఇంత మొత్తం బయటపడినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు రాష్ట్ర అబ్బారీ శాఖ సైతం రూ.1,68,45,982 విలువైన మద్యం పట్టుకుంది. ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత మొత్తం రూ.281 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

    భారీగా డబ్బు సీజ్

    TS: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో తరలిస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. డబ్బును ఏటీఎంలలో పెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సరైన ప్రతాలు చూపకపోవడంతో నగదు సీజ్ చేసి నిందితులను అందుపులోకి తీసుకున్నారు.

    చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

    hyd: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఒకjరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరొకరి మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, బోట్ల సహాయంతో వెతుకుతున్నారు. సికింద్రాబాద్ కౌకూరి దర్గాలో గంధం పండుగ సందర్భంగా నాంపల్లి నుంచి ఆ ఇద్దరు యువకులు వచ్చారని పోలీసులు తెలిపారు.

    ఎస్సై పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

    ఏపీలో ఎస్సై పోస్టుల భర్తికి రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అక్టోబర్ 12 నుంచి హాల్‌టికెట్లను APSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి డైన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఏవైనా సమస్యలు ఎదురైతే 9441450693, 9100203323 నెంబర్లను సంప్రదించవచ్చు.

    అమెరికా రోడ్లపై తుపాకితో మహిళ హల్‌చల్

    ఓ మహిళ అమెరికా రోడ్లపై తిరుగుతూ తుపాకితో హల్‌చల్ చేసింది. సదరు మహిళ రోడు దాటుతూ వాహనాలకు తుపాకి గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. ఆపై గాల్లోకి కాల్పులు జరుపుతూ హడావిడి చేసింది. అనంతరం తన తలకు తానే గురిపెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి చాకచక్యంగా ఆమెను అడ్డుకున్నారు. పోలీసు వాహనంతో ఆమెను గుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు దూసుకొచ్చి ఒక్కసారిగా పక్కకు తిప్పారు. దీంతో ఆ మహిళ క్రింద పడటంతో వెంటనే పోలీసులు వచ్చి మహిళ వద్ద ఉన్న గన్ లాక్కున్నారు. అనంతరం ఆమెను … Read more

    హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

    హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. నగర శివారులోని ఓ విల్లాలో వీరు సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నోవాటెల్ హోటల్ సమీపంలోని వసంత విల్లాస్‌లో చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. అన్ని ఇళ్లలో వీరు రెక్కీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ వైరల్‌గా మారాయి. చెడ్డీ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. 3 రోజుల క్రితం చెడ్డీగ్యాంగ్ అమీన్‌పూర్ పరిధిలోని ప్రణవ్ గేటెడ్ కమ్యూనిటీలో భారీ దొంగతనం చేశారు. #Hyderabad: Watch Three viral … Read more

    టమాటా లారీ బోల్తా: పోలీసుల భారీ బందోబస్తు

    ఆదిలాబాద్‌లో ఓ టమాటా లారీ బోల్తాపడింది. దీంతో కిందపడిపోయిన టమాటాలను జనం అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్ 44పై టమాటాలు తీసుకువెళ్లే ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో టమాటాలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. కొంతమంది అందినకాడికి ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లారీలో రూ.28 లక్షల విలువైన టమాటాలు ఉన్నాయి. Adilabad #Tomato loaded lorry turned outskirts of Adilabad town on Nh 44.police provide security# Telangana @XpressHyderabad … Read more

    CI SWARNALATHA: సినిమాల్లో హీరోయిన్‌గానూ!

    రూ.2 వేల నోట్ల నగదు మార్పిడి వ్యవహారంలో రూ.15 లక్షలు నొక్కేసిన సీఐ స్వర్ణలత గురించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ‘ఏపీ 31’ అనే సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా ఆమె పోలీస్ పాత్రే పోషిస్తోంది. ప్రస్తుతం డబ్బుల్లేక ఈ చిత్ర నిర్మాణం ఆగిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె నోట్ల మార్పిడిలో అడుగుపెట్టి అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బనీ తీయని సీఐ స్వర్ణలత ఈ అబ్బనీ తీయని దెబ్బలో … Read more