• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కట్టుకున్నోళ్లనే కడతేర్చిన జంట

    TG: సూర్యపేటలో దారుణం జరిగింది. ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. భాగ్యనగర్‌ కాలనీకి చెందిన భూక్యా వెంకన్న, షేక్‌ నస్రీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఇరువురి ఇళ్లల్లో ఈ విషయం తెలిసింది. దీంతో వెంకన్న తన భార్యను, నస్రీన్‌ తన భర్తను అడ్డుతొలగించుకొని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వెంకన్న తన భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఆపై నస్రీన్‌ వెంకన్న సాయంతో భర్తను గొంతు నులిమి చంపి ఫ్యాన్‌కు ఉరి వేసింది. ఈ ఘటనల్లో నలుగురు నిందితుల్ని … Read more

    UGC NET దరఖాస్తుల గడువు పొడిగింపు

    UGC-NET పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత నిర్ణయించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా గడువు పెంచుతూ ఎన్‌టీఏ-యూజీసీ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అభ్యర్థులు అక్టోబర్‌ 31వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో https://ugcnet.ntaonline.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే, దరఖాస్తు రుసుం చెల్లింపు గడువును సైతం అక్టోబర్‌ 31వరకు వరకూ పొడిగించారు.

    దసరా రోజు కన్నతల్లినే కడతేర్చాడు

    TG: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో దారుణం జరిగింది. కాశీపూర్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి కన్న తల్లినే కడతేర్చాడు. అనంతరం తల్లి అంజమ్మ మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి వాగులో పడేశాడు. దసరా రోజు ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్‌, విపరీతంగా అప్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ అప్పు తీర్చలేక తల్లిని చంపినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వివరించారు.

    తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు

    తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు నుంచి భారాస తరపున టికెట్‌ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు.

    కాంగ్రెస్ అంటే నాటకం: హరీశ్‌రావు

    TG: కాంగ్రెస్‌ అంటే నాటకమని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. అందుకే రైతుబంధు ఇవ్వొద్దని ఈసీకి ఫిర్యాదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అంటే మాటలు, మూటలు, ముఠాలు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో గెలవలేని అభ్యర్థులు కూడా నేనే సీఎం అంటున్నారని ఎద్దేవాచేశారు. ఆ పార్టీ నేతలకు పదవుల మీద ఉన్న ధ్యాస పనిమీద లేదని మండిపడ్డారు. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారని హరీశ్‌రావు నమ్మకం వ్యక్తంచేశారు

    భారాస నేతలకు మావోలు వార్నింగ్

    TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా BRS నాయకులకి మావోయిస్టులు వార్నింగ్‌ ఇచ్చారు. నేతలు ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారాస నేతలు పెత్తనం చెలయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని, లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవంటూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.

    నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన

    TG: ఐటీ మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో భారాస ఆధ్వర్యంలో జరగనున్న యువ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రెండు వేలకు పైగా యువత పాల్గొనే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 39 వార్డులకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు.

    నేటి నుంచి ఓటర్ల చైతన్య యాత్ర

    TG: రాష్ట్రవ్యాప్తంగా 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల చైతన్యయాత్ర చేపట్టనున్నట్లు జాగో తెలంగాణ కన్వీనర్‌ ఆకునూరి మురళి తెలిపారు. ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ నుంచి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ యాత్రను ప్రారంభిస్తారన్నారు. 27న తుంగతుర్తిలో, 28న సూర్యాపేట, కోదాడలో, 29న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడలో, 30న నల్గొండలో మూడు సమావేశాల చొప్పున జరుగుతాయన్నారు. రెండో విడత యాత్ర నవంబరు 2 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.

    ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ప్రకటన

    తెలంగాణలో ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబర్‌ 14వ తేదీ వరకు గడువు విధించింది. ఆలస్య రుసుంతో డిసెంబరు 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు బోర్డు పేర్కొంది.

    మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే: కవిత

    తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తన పార్టీ వంద సీట్లలు గెలుస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పథకాల సృష్టికర్త ఆయన ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌ను ఓడిస్తాం. ప్రజలు కాంగ్రెస్‌ గ్యారంటీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగాలేరు. ఆ పార్టీ కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది’. అని కవిత విమర్శించారు.