• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    సబ్‌స్టేషన్‌కు మొసలిని తీసుకెళ్లి నిరసన

    విద్యుత్‌ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రొణిహాల గ్రామంలోని పొలాల్లో ఈ మొసలిని గుర్తించినట్లు రైతులు తెలిపారు. రాత్రి సమయంలో పాము, తేలు, మెుసలి బారిన పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యుత్‌ అధికారులను నిలదీశారు. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నట్లు వాపోయారు. … Read more

    ఒకదానికొకటి ఢీకొన్న 158 వాహనాలు

    అమెరికాలోని లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. BREAKING: 7 confirmed DEAD in Louisiana … Read more

    కొండ చిలువతో సెల్ఫీకి యత్నం

    మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలోని కొండచిలువతో పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెల్ఫీకి యత్నించిన వ్యక్తిని చంద్రన్‌గా స్థానికులు గుర్తించారు. കണ്ണൂർ വളപട്ടണം – ഇന്നലെ രാത്രി pic.twitter.com/9Ms1OIw8qv … Read more

    పట్టపగలు రూ.14 ల‌క్ష‌ల‌ు దోచేశారు

    క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో భారీ చోరీ జ‌రిగింది. పార్కింగ్ చేసిన BMW కారు నుంచి రూ.14 ల‌క్ష‌ల‌ను గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు దుండగులు అప‌హ‌రించారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రూ. కోటి విలువ చేసే బీఎండ‌బ్ల్యూ కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసు వ‌ద్ద ఉన్న పార్కింగ్‌లో నిలిపారు. బైక్‌పై వ‌చ్చిన దుండగుల్లో ఒకడు కారు అద్దాల‌ు ప‌గుల‌గొట్టి డబ్బు ఉన్న కవర్‌ను తీసుకున్నాడు. ఆపై అక్కడి నుంచి క్షణాల్లో దుండగులు చెక్కేశారు. దొంగల కోసం పోలీసులు … Read more

    ప్రభాస్‌ బర్త్‌డేకు ఫ్యాన్స్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

    HYD: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా అది రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో 230 అడుగుల ఎత్తైన ప్రభాస్‌ కటౌట్‌ను ఫ్యాన్స్‌ పెట్టారు. ‘సలార్’లోని స్టిల్‌తో ఉన్న ఈ కటౌట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌ ఈ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా, సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. Ni puttina Roju Maku Pandaga la Undhi … Read more

    భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన భార్య

    పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను మరో మహిళకు భార్య అమ్మెసిన ఘటన కర్ణాటకలోని మాండ్యలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో ఆ గృహిణి భర్త సన్నిహితంగా ఉండేవాడు. ఓ రోజు స్థానిక మహిళతో తన భర్త పడకగదిలో ఉండటం గృహిణి గుర్తించింది. ఇద్దర్ని పంచాయతీకి లాగింది. తన దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడని వాటిని తిరిగిస్తే అతన్ని అప్పగిస్తానని మహిళ తెలిపింది. దీనికి ఒప్పుకోని గృహిణి ఆ రూ.5 లక్షలు తనకే మనోవర్తిగా ఇస్తే తన భర్తను వదిలిపెడతానని తెలిపింది. దీనికి … Read more

    ఐమాక్స్ థియేటర్‌లో అర్ధరాత్రి రచ్చ

    హైదరాబాద్ – ఐమాక్స్‌ థియేటర్‌లో అర్ధరాత్రి ప్రేక్షకులు రచ్చ చేశారు. టైగర్ ష్రాప్ నటించిన గణపత్ సినిమా నిన్న రాత్రి 11.15 గంటలకు చివరి షోగా ప్రారంభమైంది. షో స్టార్ట్ అయిన కొద్దిసేపటికే.. హాలులో భరించలేని దుర్గందం వ్యాపించింది. దుర్వాసన ఎంతకీ తగ్గకపోవడంతో బయటకు వచ్చిన ప్రేక్షకులు మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ప్రేలు కొట్టిన దుర్వాసన తగ్గకపోవడంతో హాలులో రచ్చ రచ్చ చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడంతో ప్రేక్షకులు శాంతించారు.

    కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు

    హైదరాబాద్ – రోడ్డుపై వాహనలు తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1715211924110262641?s=20

    కూలీ అకౌంట్లో రూ.200 కోట్లు జమ

    యూపీలోని బతానియా గ్రామానికి చెందిన దినసరి కూలి శివప్రసాద్ ఉన్నట్టుండి కోటీశ్వరుడయ్యాడు. అతని ఖాతాలో ఏకంగా రూ.200కోట్లు జమ అయ్యాయి. ఇటీవల తన పాన్ కార్డు పొగొట్టుకున్నట్లు చెప్పిన ఆయన.. డబ్బులు ఎవరు జమ చేశారో తనకు తెలియదన్నారు. అయితే భారీ డబ్బు జమ కావడంతో ఇన్‌కం ట్యాక్స్ కట్టాలని శివప్రసాద్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన ఖాతా నుంచి పన్ను కింద రూ.4.58 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    ఐఫోన్ పొగొట్టుకున్న ఊర్వశి రౌటేలా

    పాకిస్థాన్- ఇండియా మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా తన గోల్డ్ ఐఫోన్‌ను పొగొట్టుకుంది. శనివారం మ్యాచ్ చూసేందుకు మోదీ స్టేడియానికి వెళ్లింది. ఇండియా- పాక్ మ్యాచ్ వీక్షిస్తున్న మోజులో ఐఫోన్‌ను పొగొట్టుకుంది. ఆ ఐఫోన్ తనకు ఎంతో ప్రత్యేకమైందిగా చెప్పుకొచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌తో ఐఫొన్ తయారైందని దయచేసి ఎవరికైనా దొరికితే ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసింది.