• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    హృదయాలను కదిలిస్తున్న వీడియో

    యూపీ: ప్రతి రోజూ ఆహారం పెట్టే వ్యక్తి మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. ఆయన దేహం వద్ద రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ వానరానికి అన్నం పెట్టేవారు. రోజులో చాలా సమయం కోతితోనే గడిపే వారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ వీడియోను చేసి నెటిజన్లు చలించిపోతున్నారు. इससे बड़ी निःस्वार्थ प्रेम की … Read more

    రేపు ఆకాశంలో అద్భుతం

    రేపు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రేపు సా.4.30 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతోంది. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, దక్షిణ మధ్య అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపించనుంది. భారత్‌లో ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. సూర్యగ్రహణం ఏర్పడటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. చివరి సారిగా రింగ్‌ ఆఫ్ ఫైర్ 2012లో కనిపించింది.

    ‘పాక్-ఇండియా మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి’

    సోషల్ మీడియాలో #BoycottIndoPakMatch ట్రెండింగ్‌లో ఉంది. మన సైనికుల జీవితాల ముందు క్రికెట్ నథింగ్. శత్రువులు ఎప్పటికీ శత్రువులే. పాక్ క్రికెటర్లకు మహిళలతో డ్యాన్స్‌లు చేయిస్తూ స్వాగతం పలికాం.. కానీ అదే రోజు మన సైనికులను పాక్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. పుల్వామా వంటి ఘటనలను ఇంకా దేశ ప్రజలు మరిచిపోలేదు. పాక్ క్రికెటర్లను బాయ్ కాట్ చేయాలి. బీసీసీఐ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తోంది అని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ

    రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. కానిస్టేబుల్ సంయమనం పాటించినప్పటికీ విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. మిథిలేష్ అనే మహిళా నెంబర్ ప్లేట్ లేకుండా రాంగ్ రూట్‌లో రోడ్డు మీదకు వచ్చింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ట్రాఫిక్ పోలీసుతో వాగ్వాదానికి దిగి చెప్పుతో కొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. https://x.com/TeluguScribe/status/1712361640732369311?s=20

    కోహ్లీ పోలికలతో వ్యక్తి.. వైరల్ వీడియో

    చండీఘర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్‌ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు. https://www.instagram.com/reel/Cug-n5rMuZE/?utm_source=ig_embed&ig_rid=c406d3c2-f820-4efa-b895-77c9a294b5c2

    పెళ్లి కావట్లేదని రోడ్డెక్కిన యువకుడు

    చీరాలలో పెళ్లి కాలేదని ఓ యువకుడు వినూత్నంగా రోడ్డు మీదకు ఎక్కాడు. పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఎదురుగా నిలుచుని తనని తాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి గల కారణాలను ఓ ప్లెక్సీలో రాశాడు. తాను ఏ యువతికైనా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. కట్నం పట్టింపులు లేవని తనను పెళ్లి చేసుకునే అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. Courtesy Twitter: Courtesy Twitter:

    జానా రెడ్డికి కీలక బాధ్యతలు

    కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జానా నైతృత్వంలో ఫోర్ మెన్ కమిటీ నియమించింది. జానారెడ్డి , మణిక్రావు ఠాక్రే , దీపదాస్ మున్షీ , మీనాక్షి నటరాజన్‌తో కమిటీ ఏర్పడింది. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులని బుజ్జగించే బాధ్యత వీరు తీసుకోనున్నారు. ఈరోజు జానారెడ్డి నేతృత్వంలోని ఫోర్ మెన్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. 70 … Read more

    అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

    పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఓ చెట్టుపై వేసిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ చెట్టును కౌగిలించుకొని వృక్షాలను రక్షించాలనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ కుమార్ సాను ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. magnificent art meaningful drawing#5DaysToTiger3Trailer#InternationalDayOfGirlChild#INDvsAFG #RashmikaMandanna#PalestineUnderAttack#AnimalTheFilm #AamirKhan #AmitabhBachchanBirthday#HamasMassacre #Israel#GazaUnderAttackpic.twitter.com/37KW4LviYf — Singer Kumar Sanu (@KumarsanuTc) October 11, 2023

    బిహార్‌లో అమానవీయ ఘటన

    బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ముగ్గురు పోలీసులు కాలువలో పడేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇది చూసి షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. A gruesome video from Bihar's Muzaffarpur is going viral on social media. The video shows how the … Read more

    యువకుడి ఖాతాలో రూ.753 కోట్లు

    తమిళనాడులోని తంజావూరుకి చెందిన ఓ యువకుడి ఖాతాలోకి ఒక్కసారిగా రూ.756 కోట్ల నగదు జమ అయ్యింది. గమనించిన మహ్మద్‌ ఇక్రీష్‌.. సంబంధిత బ్యాంక్‌ సేవా కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. దీంతో బ్యాంక్‌ వర్గాలు అతడి ఖాతాను సీజ్‌ చేశాయి. సొమ్ము వచ్చిందని చెబితే చివరకి తన ఖాతానే సీజ్‌ చేయడంపై యువకుడు షాక్‌ గురయ్యాడు. దీనిపై బ్యాంక్‌ అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని అతడు మీడియా ముందుకు తీసుకొచ్చాడు.