• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు

     ఝార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌లో ఆదివారం రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంతో దాదాపు 50 మందికి పైగా కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంకేతిక కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.  

    ఇంకా ఐదుగురు ఆపదలోనే..

    ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఐదుగురు కేబుల్ కార్లలోనే చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మందిని రక్షించినప్పటికీ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ చికిత్స పొందుతూ మరణించారు.  ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. రెండు Mi-17 విమానాలతో భారత వైమానిక దళ సిబ్బంది కూడ పర్యాటకులను రక్షించే బాధ్యతను తీసుకుంది. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి ..ఘటనకు గల కారణాలు ఈనెల 26లోగా తెలపాల్సిందిగా కోరింది.

    దేశంలోనే అత్యంత ఎత్తైన రోప్

    ఈ త్రికూట్ రోప్ వే భారత్ లోనే అత్యంత ఎతైన వర్టికల్ రోప్ వే. త్రికూట పర్వతాల్లోని స్వామి వారిని దర్శించుకోవడానికి, అలాగే సరదాగా గడపడానికి ప్రయాణికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ రోప్ వే 766 మీటర్ల పొడవు ఉండగా, 25 క్యాబిన్లు ఉంటాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv