• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మానవత్వం చాటుకున్న సీఐ, ఎస్సై

    TS: భూపాలపల్లి సీఐ, చిట్యాల ఎస్సై మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని ఇటీవల వరద ముంచేసింది. దీంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. అయితే, శవం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఎవరూ దగ్గరికి రాలేదు. ఈ క్రమంలో భూపాలపల్లి సీఐ రాంనర్సింహా రెడ్డి శవాన్ని ఓ కట్టెకు కట్టించి స్వయంగా మోసుకొచ్చారు. చిట్యాల ఎస్సై రమేశ్ సాయం తీసుకున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల పాటు మోసుకొచ్చి బంధువులకు అప్పగించారు. దీంతో వీరిని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే గండ్ర అభినందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv