రుణ బకాయిల వసూలుకు సంబంధించి RBI నిబంధనలు కఠినతరం చేసింది. రుణగ్రహితలకు ఆయా సంస్థలు ఉదయం 8 లోపు, సాయంత్రం 7 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక సేవల్లో ఔట్ సోర్సింగ్, ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముసాయిదాను RBI విడుదల చేసింది. డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు, డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లకు తాము తీసుకువచ్చిన ప్రవర్తనా నియామావళిని అమలు చేయాలని పేర్కొంది. కస్టమర్లతో మాట్లాడే విషయంలో ఏజెంట్లకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది.
-
© ANI Photo
-
Screengrab Twitter:@Sunil_Deodhar