• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలోకి ధాస్‌ కా ధమ్కీ… ఎప్పుడంటే?

    టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌, నివేథా పేతురాజ్‌ నటించిన ధాస్‌ కా ధమ్కీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 14 నుంచి ఆహా వేదికగా వస్తోంది. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రానికి విశ్వక్‌ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. హిట్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల కాస్త వెనకబడిందని టాక్. మరి ఓటీటీలో చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.   కృష్ణదాస్‌గా, సంజయ్ రుద్రగా విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్ చేసిన  సినిమా ఇది. … Read more

    బాలయ్య, పవన్‌లను ప్రశ్నించిన క్రిష్..!

    పవర్ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ గ్లింప్స్‌ని ఆహా విడుదల చేసింది. డైరెక్టర్ క్రిష్ బాలయ్య, పవన్‌లను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తమతో పనిచేయడంపై అభిప్రాయాన్ని చెప్పాలని క్రిష్‌ని బాలయ్య కోరారు. దీంతో ‘త్రివిక్రమ్ అందుకే తప్పించుకున్నారా?’ అంటూ సరదాగా క్రిష్ వ్యాఖ్యానించారు. అనంతరం పవన్ కళ్యాణ్, బాలకృష్ణలను క్రిష్ పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా సరదాగా సాగుతుండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ రోజు రాత్రి 9గంటలకు పార్ట్-2 ప్రసారం కానుంది. సీజన్2కి ఇదే ఫైనల్ ఎపిసోడ్ అని ఆహా వెల్లడించింది. Power … Read more

    ఒక రోజు ముందుగానే బాలయ్య, పవన్ ఎపిసోడ్

    ‘ఆహా’లో ప్రసారం కానున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌పై ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్‌కి భారీగా స్పందన లభించింది. అయితే, ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెబుతూ ఆహా కీలక ప్రకటన చేసింది. ఒకరోజు ముందుగానే పవర్ ఎపిసోడ్‌ని ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 2న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తొలుత ఫిబ్రవరి 3న ఎపిసోడ్‌ని విడుదల చేయాలని భావించింది. ఫ్యాన్స్ ఆసక్తి, కోరిక మేరకు ఆహా ఒక రోజు ముందుకు జరిపింది.

    యూట్యూబ్‌లో ‘పవర్’ ప్రోమో సునామీ

    బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. ప్రోమో విడుదలైన 18 గంటల్లోనే 3మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్‌ పార్ట్ 1ని ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య ఆరా తీశారు. త్రివిక్రమ్‌తో స్నేహం, చరణ్ పెంపకం వంటివాటి గురించి పవన్ సరదాగా ఆన్సర్ చేశారు.

    27నుంచి ‘ఆహా’లో 18 పేజెస్ స్ట్రీమింగ్

    సుకుమార్ రైటింగ్స్‌లో డైరెక్టర్ సూర్యప్రతాప్ తెరకెక్కించిన సినిమా ‘18 పేజెస్’. గతేడాది డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఈ నెల 27న ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కాబోతోంది. ‘ఆహా’లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు ఆహా ఓ ట్రైలర్‌ని విడుదల చేసింది. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. గోపీ సుందర్ సంగీతం అందించగా.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ ముందు ఈ సినిమా మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. Sukumar Writings … Read more

    ‘అన్‌స్టాపబుల్’లో వీరసింహారెడ్డి టీం

    బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ‘వీరసింహారెడ్డి’ టీం సందడి చేసింది. డైరెక్టర్ గోపీచంద్, నటీనటులు ఈ ఎపిసోడ్‌కి హాజరయ్యారు. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్‌లను బాలయ్య సరదాగా ఆటపట్టించారు. గోపీచంద్ మలినేని వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు. ‘నేనే హైపర్ అనుకుంటే.. బాలయ్య నాకన్నా హుషారుగా ఉన్నారు’ అంటూ వరలక్ష్మి మాట్లాడింది. ఇంటర్వెల్ సీన్ ఒకే చెప్పిన సందర్భంలోనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ గోపీచంద్ బాలయ్యతో చెప్పాడు. ఈ నెల 12న సినిమా విడుదల కానుండగా.. ఈ ఎపిసోడ్ 13న ప్రసారం కానుంది.

    గోపీచంద్‌ని ఆటపట్టించిన ప్రభాస్

    బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 లో ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆహా గోపీచంద్‌కి చెందిన గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ సరదాగా కనిపించారు. ‘2008లో కాదు సర్..’ అని గోపీచంద్ అంటుంటే.. ‘రేయ్..’ అని ప్రభాస్ అనడంతో నవ్వులు పూచాయి. అనంతరం గోపీ‌చంద్‌ని ప్రభాస్ ఆటపట్టిస్తుంటే బాలయ్య మధ్యలో నిలుచుండటం వంటివాటితో గ్లింప్స్ సరదాగా సాగిపోయింది. వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు.