• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు: హరీశ్‌‌రావు

    కాంగ్రెస్‌కు అధికారమిచ్చి ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్‌నే కాంగ్రెస్ ఇస్తానంటోందని తెలిపారు. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని మంత్రి చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ఉపన్యాసాలతో ఊదరగొట్టారని విమర్శించారు.

    ‘కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే’

    TG: హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పాలన వస్తే ప్రతి విషయానికి ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఆ రాష్ట్రంలో 5 గం.ల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. హుజూరాబాద్‌లో భాజపా మూడో స్థానానికి పడిపోయింది. అన్ని సర్వేలలో కూడా భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు’ అని అన్నారు.

    రేవంత్‌ తెలంగాణ వ్యతిరేకి: హరీష్‌రావు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ప్రజలు తెలంగాణకు మద్ధతు ఇస్తే రేవంత్ తుపాకీ పట్టుకుని బయటికొచ్చి బెదిరించాడన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా రేవంత్‌ రెడ్డి పదవిని పట్టుకుని పాకులాడిండని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారన్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

    ‘కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రం నాశనమే’

    HYD: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే భారాస ప్రభుత్వం తిరిగి రావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డిని ఇంటికెళ్లి కలిసిన మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

    దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్: హరీష్‌రావు

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ గిరిజన తండాలు, గూడేలకు పలు హామీలు ఇచ్చి మోసం చేసింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్నాం. రైతు బీమా మాదిరిగానే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తాము. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అంటుంది. 24 గంటల కరెంట్ కావాలనుకునే వాళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలి’ అని … Read more

    ‘హైదరాబాద్‌కు అమరావతి గతే’

    TG: కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే హైదరాబాద్‌కు అమరావతి గతే పడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భయపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ‘సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవన్నీ కేసీఆర్‌ వల్లే సాధ్యమయ్యాయి. హీరోలు సన్నీడియోల్‌, రజనీకాంత్‌లు హైదరాబాద్‌ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీలకు ఇక్కడి అభివృద్ధి అర్థమవుతోంది గానీ, ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు’ అని అన్నారు.

    హరీష్, కేటీఆర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ!

    ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో కీలక సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇద్దరితో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ ఆలోచనలు పంచుకోనున్నారు. ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నారు.

    అలా చేస్తే పరువైనా దక్కుతుంది: హరీష్‌రావు

    బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. స్వంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని విమర్శించారు. తెలంగాణలో డిపాజిట్ల కమిటీనైనా వేసుకుంటే బీజేపీకి పరువైన దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడదని కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీష్‌రావు కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    బిల్లా రంగాల్లా కేటీఆర్ హరీష్ దోపిడి: రేవంత్

    టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు బిల్లా రంగాలాగా రాష్ట్రమంతా తిరుగుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ద్వారా 10 వేల ఎకరాల భూమి కాజేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాంట్రాక్టుల జేబులు నింపేందుకే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ఇంకో రెండు నెలల్లో బీఆర్ఎస్ అధికారం ముగిసి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు.