• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారా లోకేశ్‌పై ఆర్జీవీ సెటైర్లు

    AP: టీడీపీ నేత నారా లోకేశ్‌ తనపై చేసిన విమర్శలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. లోకేశ్‌ను చూసి నవ్వాలా? జాలి పడలా? నవ్వాలా? ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు పరిస్థితి చూసి లోకేశ్‌ మైండ్‌ స్టబిలైజ్‌ అయ్యిందేమో అని విమర్శించారు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదేమో అని సలహా ఇచ్చారు. సబ్జెట్‌ తెలియకుండా మాట్లాడితే మీ తండ్రిని దేవుడు కూడా కాపాడలేడని ఆర్జీవీ అన్నారు. కొద్ది రోజులు లండన్‌కు వెళ్లి రెస్ట్‌ తీసుకోవాలని లోకేశ్‌కు సూచించారు. Hey @NaraLokesh … Read more

    ఏపీ.. ఫ్యాక్షన్‌ ప్రదేశ్‌గా మారింది: లోకేశ్

    AP: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వైకాపా అధినేత తన సొంత బాబాయ్‌ వేసేస్తే.. ఆయన ఫ్యాన్స్‌ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఆరోపించారు. అడ్డంగా ఉన్న బైక్ తీయాల‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ బీఆర్ సింగ్ హార‌న్ కొట్టడ‌మే నేర‌మైందన్నారు. న‌డిరోడ్డుపై వైకాపా నేత‌లు గూండాల కంటే ఘోరంగా డ్రైవర్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ వల్ల ఆంధ్రప్రదేశ్‌.. ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు.

    పవన్‌, లోకేశ్‌పై నిప్పులు చెరిగిన కొడాలి

    AP: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాలేరని విమర్శించారు. లోకేశ్ పప్పు అని మరోసారి రుజువైందని, ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. అటు చంద్రబాబు కోసమే పవన్‌ ‘జన సున్నా’ పార్టీ పెట్టారని నాని సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ టీడీపీకి మద్దతుగా ఉన్నారని ఆరోపించారు.

    నేడు టీడీపీ, జనసేన జేఏసీ తొలి భేటీ

    నేడు రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ భేటికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ హాజరవుతారు. మ. 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ భేటిలో పవన్‌, లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొంటారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహార్‌ సమావేశానికి హాజరవుతారు.

    సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాలి: లోకేశ్

    AP: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం – మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం’ అంటూ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయాలని లోకేశ్‌ కోరారు. నాలుగున్నరేళ్లుగా అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని ట్వీట్ చేశారు.

    ‘జైలులో చంద్రబాబు హత్యకు కుట్ర’

    AP: అనారోగ్యం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ చంద్రబాబును రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందన్నారు ‘చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది. భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్‌ సర్కార్‌దే బాధ్యత. ఆయన ఆరోగ్యంపై ఎందుకీ కక్ష?’ అని ప్రశ్నించారు.

    సీఎం జగన్‌కు పిచ్చి ముదిరింది: లోకేష్

    సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదు. దమ్ముంటే చెప్పాలి. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కింది. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోంది అని ఎద్దేవా చేశారు.

    అమిత్‌ షాకు అన్ని విషయాలు చెప్పా: లోకేష్

    కేంద్రమంత్రి అమిత్‌ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై షాకు అన్ని విషయాలు వివరించినట్లు లోకేష్ వెల్లడించారు. ‘అమిత్‌ షా నన్ను కలవాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఈ మేరకు అమిత్ షాను కలిశాను. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు భద్రత పరంగా ఆందోళన ఉందని చెప్పా. సీఐడీ ఎన్ని కేసులు పెట్టిందని షా అడిగారు. రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పాను’ అని లోకేష్ … Read more

    లోకేష్ బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పోజ్

    స్కిల్ స్కాం కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ముందు వాదనలు వినిపించిన సీఐడీ.. లోకేష్‌ను అరెస్ట్ చేయం. కానీ 41ఏ కింద నోటీసులు అందిస్తాం. విచారణకు పిలుస్తాం అని పేర్కొంది. మరోవైపు ఆంగళ్లు కేసులో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రేపు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది.

    అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

    టీడీపీ నేత నారా లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్న లోకేశ్ ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి అమిత్ షాను కలవడంపై చర్చ జరుగుతోంది. తన తండ్రి అరెస్ట్, కోర్టుల్లో జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకు వివరించినట్లు లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.