• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ పార్టీలు మాదిగ విరోధులు: ప్రధాని

    భారాస, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరై మాట్లాడారు. ‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా’ అని అన్నారు.

    నాకు సొంతిల్లు కూడా లేదు: మోదీ

    పేదల సొంతింటి కళను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనకు మాత్రం సొంతిల్లు లేదన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతే కనిపించేది. పేదల కోసం మా ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విధ్వంసమే ఉంటుంది. కాంగ్రెస్ నకిలీ లబ్ధిదారుల ముసుగులో తమ అనుచరుల జేబులను నింపేసింది. మా ప్రభుత్వం వచ్చాక వారిని ఏరివేశాం. తద్వారా రూ.2.75లక్షల కోట్లను ఆదా చేశాం’ అని మోదీ పేర్కొన్నారు.

    కేసీఅర్‌ను ఇంటికి పంపాలి: మోదీ

    తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని బీసీ ఆత్మగౌరవ సభలో అన్నారు. ‘తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వాటితోనే భారాస మోసం చేసింది. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే’ అని మోదీ అన్నారు.

    కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

    ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోది కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఖజానాను నింపుకోంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘మహాదేవ్’ పేరును కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. మహాదేవ్ బెట్టింగ్ నుంచి భారీగా డబ్బులు తీసుకుంటుందని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని మోదీ ఆరోపించారు.

    ‘ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధం’

    2036లో ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధంగా ఉంది ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో క్రీడా నైపుణ్యాలకు కొదవ లేదన్నారు, దేశం అనేక మంది ఛాంపియన్లను సృష్టించిందని చెప్పారు. నేడు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది క్రీడలకు కేటాయించిన బడ్జెట్‌.. తొమ్మిదేళ్ల క్రితంనాటి బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువని చెప్పారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ గొప్ప ఆసక్తి కనబరుస్తోందని మోదీ పేర్కొన్నారు.

    వచ్చే 25 ఏళ్లు చాలా ముఖ్యమైనవ: మోదీ

    వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్‌ పటేల్‌ స్పూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. దూరదృష్టితో కూడిన రాజ నీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని తెలిపారు. దేశ అభివృద్ధికి బుజ్జగింపు రాజకీయాలే అడ్డంకిగా నిలుస్తున్నాయన్నారు. సానుకూల రాజకీయాలు చేయలేని కూటమి పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ చూచించారు. వారు సొంత ప్రయోజనాల కోసం దేశ ఐక్యతపైనా రాజీ పడతారని పేర్కొన్నారు.

    ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ శుభాకాంక్షలు

    ఇస్రో గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా నేడు టీవీ-డీ1 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గగన్‌యాన్ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు. అయితే నేడు నింగిలోకి వెళ్లిన రాకెట్ నుంచి మాడ్యూల్ విడిపోయి పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.

    NaMo Bharat Rail: గంటకు 160 కి.మీల వేగంతో దూసుకెళ్లే తొలి లోకల్‌ ట్రైన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే షాకే!

    దేశంలో తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ (RAPIDX) రైలు పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రేపు (శుక్రవారం) ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి అచ్చం మెట్రో రైలులాగా తమ సేవలను అందిస్తాయి. దిల్లీ-ఘజియాబాద్‌ రీజనల్‌లోని సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ RAPIDX రైళ్లు ప్రయాణించనున్నాయి. గంటకు 160కి.మీల వేగంతో ఈ ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తర్వాత కేంద్రం తీసుకొస్తున్న మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు (High Speed Local Train) ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో … Read more

    మోదీ వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి

    ఇజ్రాయెల్‌-పాలస్తీనాల సంక్షోభంపై భారత వైఖరిని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీరు మొదటి నుంచి భిన్నంగా ఉందని చెప్పింది.‘పాలస్తీనా హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారత్‌ మద్దతుగా నిలిచేది. దాడుల విషయానికొస్తే వాటిని తీవ్రంగా ఖండించేంది. ప్రస్తుతం భారత వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంపై భారత్‌ తన వైఖరిని హుందాగా, గౌరవప్రదమైన రీతిలో వెల్లడించాలి’అని కాంగ్రెస్ పేర్కొంది.

    నేడు ప్రధాని మోదీతో టీబీజేపీ నేతల కీలక భేటీ

    నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతలు కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరపనున్నారు. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.