• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్-బాలయ్య ఎపిసోడ్; సెన్సేషనల్ రెస్పాన్స్

    నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. పవన్, బాలయ్యలను ఒకే వేదికపై చూసేందుకు కళ్లు సరిపోవటం లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ ట్రెండింగ్‌గా మారింది. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ సాధించింది. ఇక ఈ సాలిడ్ ఎపిసోడ్ ఆహాలో త్వరలోనే రిలీజ్ కానుంది.

    ఆహాలో పవన్‌ ఎపిసోడ్‌పై క్రేజీ పోస్ట్

    ఆహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్‌లో పవన్‌ను బాలయ్య ఏం ప్రశ్నలు అడిగారు? టీడీపీ- జనసేన పొత్తు గురించి ఏమైన చర్చ వచ్చిందా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లోనూ రేకెత్తింది. తాజాగా ఈ ఎపిసోడ్‌పై ఆహా స్పందించింది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2లో పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఇమేజినేషన్‌కే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రామ్ లోడింగ్ సూన్” అంటూ ఆహా ట్వీట్ చేసింది.”మేన్ ఆఫ్ మాసెస్ మీట్స్ గాడ్ ఆఫ్ మాసెస్” అంటూ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌తో … Read more

    నేను ఆ ముగ్గురినే నమ్ముతా; బాలకృష్ణ

    తాను సినిమాల విషయంలో ముగ్గురిని మాత్రమే నమ్ముతానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను పూర్తిగా నమ్ముతానని చెప్పారు. ‘వీరసింహారెడ్డి’ విజయంతో మూవీ టీమ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ‘‘తాను నటించిన ‘వీరసింహారెడ్డి’ని ఆదరించినందుకు కృతజ్ణతలు. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ తీవ్రంగా కృషి చేసింది. తమన్ పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఔట్‌పుట్ రాబట్టగలిగే సత్తా గోపీచంద్‌కు ఉంది.’’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.

    ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య

    [VIDEO:](url) బాలయ్య వీరసింహా రెడ్డి విడుదలైన థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ వద్ద దీపావళిని మించి టపాసులు కాల్చారు. డప్పు, దరువులతో కోలాహలం నెలకొంది.ఈ థియేటర్‌కి నటసింహం బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని వచ్చారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూశారు. వీరసింహా రెడ్డి అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరు 30 లక్షలు, వరంగల్‌ 17.58 లక్షలు బుక్‌ అయినట్లు తెలుస్తోంది. https://twitter.com/i/status/1613434441556439041

    తెరవెనుక ‘అన్‌స్టాపబుల్2’ ప్రభాస్ ఎపిసోడ్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్2’లో ప్రభాస్, గోపీచంద్ సందడిని మనం తెరపై చూశాం. అయితే, తెర వెనకాల ఏం జరిగిందనే విషయాన్ని ఆహా ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. ఇందులో బాలయ్య ప్రభాస్‌తో సరదాగా మాట్లాడుతుండటం కనిపిస్తోంది. ‘మీట్ ది రియల్ సైడ్ ఆఫ్ బాలయ్య’ అని బాలకృష్ణ ప్రభాస్‌తో అనగానే.. ‘అయ్యో తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులివ్వడం నవ్వులు పూయించింది. దీంతో పాటు షో షూటింగ్ మధ్యలో జరిగిన సన్నివేశాలు ఆహ్లాదంగా ఉన్నాయి. బాహుబలి ఎపిసో‌డ్‌ పేరుతో రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ … Read more

    ట్రెండింగులో ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుదలైన 20 గంటల్లోనే 6.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ని దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. లక్షల్లో లైక్స్‌ని సంపాదిస్తోంది. బాలయ్య మాస్ డైలాగులు, ఎలివేషన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలను కూడా డైలాగుల ద్వారా పరోక్షంగా ప్రస్తావించడం, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్రైలర్‌ని చూస్తుంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు గుర్తుకొస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

    తాతకు తగ్గ మనవడు; డైలాగ్‌ చెప్పిన బాలయ్య మనవడు

    ‘వీరసింహారెడ్డి’ డైలాగ్‌తో నందమూరి బాలకృష్ణ మనవడు ఆర్యవీర్ అదరగొట్టాడు. ‘‘భయం నా బయోడేటాలోనే లేదురా బోస్‌డీకే’’ అంటూ ఆర్యవీర్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒంగోలులో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. స్క్రీన్‌పై మనవడిని చూసుకుని బాలయ్య మురిసిపోయారు. కాగా జూ.ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్‌లోని దివి నుంచి దిగివచ్చావా సాంగ్‌కు బాలయ్య కూర్చునే డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

    సూపర్.. ట్రైలర్ అదిరింది

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదలైంది. ‘తనది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్’ వంటి మాస్ డైలాగులతో ట్రైలర్ హోరెత్తిపోతోంది. ఒక్క ట్రైలర్‌లో ఎన్నో డైలాగులను ఇమిడ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది.

    సంప్రదాయ చీరలో శ్రుతిహాసన్

    ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రుతిహాసన్ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి ముందు ట్రెడిషనల్ బ్లాక్ చీరలో కనిపిస్తూ శ్రుతి వయ్యారాలు వలకబోసింది. ఈ వీడియోను శ్రుతిహాసన్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. దీంతో ట్రెడిషనల్ ట్రెండీ లుక్‌లో శ్రుతి అదరగొట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. https://www.instagram.com/reel/CnEWB9-BSdQ/?utm_source=ig_web_copy_link Screengrab … Read more

    ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకకు అనుమతి నిరాకరణ

    నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏబీఎం కళాశాల మైదానం ఈ వేడుకకు వేదిక కావడంతో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశముందని భావించి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈవెంట్‌ని ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చిత్ర నిర్మాతలు సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ సభల్లో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. His Mass Craze … Read more