• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పులి, సింహం మధ్యలో క్రిష్

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌స్టార్‌ రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో దూసుకెళ్తోంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల గురించి బాలయ్య సూటి ప్రశ్నలు వేశాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా అతిథిగా వచ్చాడు. తమ ఇద్దరిలో కనిపించిన తేడా ఏంటి అని ప్రశ్నించగా… పులి, సింహం మధ్యలో నా తల ఉందంటూ చమత్కరించాడు. ఏపీ సర్కారుపై, అధికారులపై జనసేనాని విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది.

    పవన్ ఎపిసోడ్; ‘ఆహా’కు టెన్షన్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి పవన్ ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ [ఆహా](url)లో ప్రసారం అవుతుంది. ఈ ఎపిసోడ్‌కు దాదాపు 2 మిలియన్ల మంది యూజర్ల ట్రాఫిక్ ఉండొచ్చని ఆహా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సర్వర్ క్రాష్ అవ్వకుండా ఆహా ముందు జాగ్రత్తగా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదనపు సర్వర్లు ఏర్పాటు చేసుకుంటోంది. సర్వర్ థ్రెషోల్డ్‌లను మరింత మెరుగుపరుస్తోంది. ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. Server threshold pencham, Backup servers pedutunnam … Read more

    ఫలించిన ‘బాలయ్య’ మంత్రం

    నందమూరి బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చదవగానే నందమూరి తారకరత్నలో కదలికలు వచ్చినట్లు సీనియర్ ప్రొడ్యూసర్, నందమూరి ఫ్యామిలీ సన్నిహితుడు తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. కుప్పంలో తారకరత్న అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బాలయ్య మంత్రం చదవగానే తారకరత్న గుండె రీ ఫంక్షనింగ్ జరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం తారకరత్న క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో తారకరత్నను విలన్‌గా తీసుకోవాలని భావించారని పేర్కొన్నారు.

    పవన్, బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రొమో

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రొమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు హీరోలు హంగామా చేశారు. పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్‌ కూడా పాల్గొన్నాడు. మధ్యలో రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మరీ నవ్వించాడు బాలయ్య. పవన్ వివావాలకు సంబంధించి కూడా బాలయ్య ప్రశ్నించారు.

    పవన్, బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రొమో

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రొమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు హీరోలు హంగామా చేశారు. పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్‌ కూడా పాల్గొన్నాడు. మధ్యలో రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మరీ నవ్వించాడు బాలయ్య. పవన్ వివావాలకు సంబంధించి కూడా బాలయ్య ప్రశ్నించారు.

    బాలయ్య నెక్ట్స్ మూవీలో హనీరోజ్?

    నందమూరి బాలకృష్ణ సరసన హనీరోజ్ మళ్లీ నటించనుందని వార్తలు వైరల్‌గా మారాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించే బాలయ్య మూవీ ‘ఎన్‌బీకే 108’లో హనీరోజ్ నటిస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి. బాలకృష్ణ రికమెండ్ చేయడంతో అనిల్ ఒప్పుకున్నట్లు టాక్. కానీ ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని సినీ ప్రియులు చెబుతున్నారు. ‘ఎన్‌బీకే 108’లో హనీ నటించడం వట్టి పుకార్లేనని పేర్కొంటున్నారు. కాగా ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య, హనీరోజ్ కెమిస్ట్రీ అదిరిపోయిన సంగతి తెలిసిందే.

    హీరోయిన్‌తో బాలయ్య నైట్ పార్టీ; మందు గ్లాసుతో?

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్య, హనీరోజ్ హైలెట్‌గా నిలిచారు. పార్టీలో వీరిద్దరూ ఒకరికి ఒకరు తాగిపించుకుంటున్నట్లుగా కలసి ఆల్కహాల్‌ను ఆస్వాదించారు. చేతులు మార్చుకుంటూ మరీ మద్యం సేవించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా హనీరోజ్ ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

    తెలంగాణ నేపథ్యంలో బాలయ్య సినిమా

    బాలయ్యతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తీయబోయే సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు. వీరసింహారెడ్డి రాయలసీమలో దిగితే.. వచ్చే సినిమాలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేగాకుండా తెలంగాణ యాసలో అనిల్ రావిపూడి డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. వచ్చే సినిమాలో ఫ్లాష్ బ్యాక్, తండ్రీకుమార్తెల మధ్య ఎమోషనల్ డ్రామా ఉండే అవకాశం ఉంది.

    రామాయణం అలా.. మహాభారతం ఇలా..!

    మనం ఎలా బతకాలో రామాయణం సూచిస్తుందని.. ప్రస్తుతం ఎలా నడుచుకుంటున్నామో మహాభారతం చెబుతోందని బాలకృష్ణ వెల్లడించారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్‌తో మెలిగిన తీరును వివరించారు. ఈ కార్యక్రమానికి వీరసింహారెడ్డి చిత్రబృందంతో పాటు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, శివనిర్వాణ, యువ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    పాట పాడిన బాలయ్య

    నందమూరి బాలకృష్ణ మరోసారి తన గాత్రానికి పని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీరసింహా రెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో పాట పాడారు. మాతో పెట్టుకోకు అనే సినిమాలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటను ఆలపించారు. బాలయ్య స్టేజీపై పాట పాడటంతో ప్రేక్షకులు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహా రెడ్డి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్లలో రికార్డుల మోత మోగించారు. చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.