[వీడియో;](url) స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపించారు. తనపై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ మహిళా నేతతో రాయబారం పంపారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యేతో బయటికి వెళ్తే డబ్బు, బంగారం, పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తనే భరిస్తాడని రాయబారం పంపినట్లు తెలిపారు. తననే కాదు మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.