ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సముద్రంలో దాచిన 32.689 కిలోల బంగారాన్ని వెతికి మరీ కనిపెట్టారు. తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియాలో రెండు ఫిషింగ్ బోట్లు బంగారాన్ని దాచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డీఆర్ఐ, కస్టమ్ అధికారులతో కలిసి కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ని చేపట్టారు. సముద్రం లోనికి స్కూబా డైవింగ్ చేసి అక్కడ దాచిన బంగారాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.20.2 కోట్లు ఉంటుందని అంచనా. శ్రీలంక నుంచి ఇండియాకు తీసుకొస్తుండగా పట్టుకున్నారు.
-
Courtesy Twitter:@ANI
-
Courtesy Twitter:@ANI
-
Courtesy Twitter:@ANI
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!