• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీఎస్పీపై మంత్రి జోగి రమేష్‌ దురుసు ప్రవర్తన

    ఏపీ: డీఎస్పీ పట్ల మంత్రి జోగి రమేష్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్ అవుతోంది. కృష్ణజిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన జరిగింది. మరో మంత్రి రోజాకు పుష్పగుచ్ఛం అందించేందుకు ఎస్పీ జాషువా వెళ్తుండగా.. అక్కడున్న వారిని పక్కకు జరిపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. ఆ సమయంలో పక్కకు పొమ్మంటూ డీఎస్పీని మంత్రి జోగి రమేశ్ విసుక్కున్నారు. డీఎస్పీ పట్ల మంత్రి వ్యవహరించిన తీరు సరిగా లేదని పోలీసులు అసంతృప్తి చెందారు. ఏయ్.. ముందు పక్కకు జరుగు..డీఎస్పీపై నోరు పారేసుకున్న మంత్రి జోగి … Read more

    బాస్ పార్టీ పాట రియాక్షన్ చూడండి

    చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైన బాస్ పార్టీ పాట రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట మెుదటిసారి విన్నప్పుడు రియాక్షన్ ఎలా ఉందనే దానిపై చిత్ర బృందం వీడియోను విడుదల చేసింది. ఇందులో బాబీ, సుకుమార్, చిరు… మాస్ పాటను ఆస్వాదించారు. కుర్చీల్లో కూర్చొని చిన్న చిన్న స్టెప్పులు వేశారు. జనవరి 13న సంక్రాంతికి సినిమా విడుదలవుతుంది. చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

    దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు

    ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ‘హారే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని అసభ్యంగా చిత్రీకరించాలని కరాటే కల్యాణి, హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించాయి. ఆ గీతంలో వినిపించే మంత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌లో ఈ పాట విడుదలైంది.

    దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు

    టాలివుడ్‌ స్టార్‌ మ్యూజిషియన్‌ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని వారు ఆరోపించారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి DSP హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

    ‘ఓ పారి’ పాప్ సాంగ్ రిలీజ్

    పాన్ ఇండియా రెంజ్‌లో కంపోజ్‌ చేసిన ‘ఓ పారి’ పాప్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. తొలిసారి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సాంగ్‌ను DSP కంపోజ్ చేశారు. ఈ పాటక్ లిరిక్స్, ఎడిటింగ్, డ్యాన్స్ అన్ని తానై వ్యవహరించారు. సాంగ్‌లోని లిరిక్స్ బాగున్నాయి. లోకెషన్స్‌ రిచ్‌గా కనిపించాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

    ఓ పిల్లా ప్రొమో సాంగ్ రిలీజ్

    తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈమేరకు పాన్ ఇండియా రెంజ్‌లో ఓ వీడియో సాంగ్‌ను రూపొందించాడు. ఈ సాంగ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 4న రిలీజ్ కానుంది. ఓ పిల్లా, ఓ పన్నే, ఓ పోరి, ఓ పెన్నెమా అంటూ దేవిశ్రీ హమ్ చేస్తూ సాంగ్ ప్రొమో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ [ప్రొమో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Teaser of Pan Indian Rockstar #DSP’s Debut Hindi Music Video#OPari … Read more

    డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పాన్ ఇండియా మూవీ ప్ర‌క‌ట‌న‌

    ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ నేడు మ‌రో కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు. పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఒక పాన్ఇండియా మూవీని తెర‌కెక్కించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. టైటిల్ ‘WHO -Trust no one’ అని ప్ర‌క‌టించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. న‌టీన‌టులు ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ రాక్ష‌సుడు సీక్వెల్‌గా రాక్ష‌సుడు 2 త్వ‌ర‌లో రానుంద‌ని ఇటీవ‌లే తాజాగా వెల్ల‌డించారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి Blockbuster Director @DirRameshVarma … Read more