• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

    HYD: నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని నాలుగంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనాస్థలికి 4 ఫైరింజన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్‌ తయారీ కోసం వాడే కెమికల్స్‌ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్లు సమాచారం. యజమాని జైశ్వాల్‌కు ఓ ప్లాస్టిక్‌ తయారీ ఫ్యాక్టరీ ఉన్నట్లు గుర్తించారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Major #FireAccident out break … Read more

    భారీ అగ్ని ప్రమాదం.. 22 బస్సులు దగ్థం

    బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 22 బస్సులు దగ్థమయ్యాయి. బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పార్కింగ్‌లో ఉన్న బస్సుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. అవి మిగతా వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టానికి దారి తీసింది. ప్రమాద సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. #BreakingNews Massive fire near a garage in Bengaluru, fire-fighting teams on spot #Bengaluru #BengaluruFire … Read more

    సికింద్రాబాద్‌లో భారీ అగ్రి ప్రమాదం

    సికింద్రాబాద్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. క్లాక్‌ టవర్‌ సమీపంలో ఉన్న నవకేతన్‌ కాంప్లెక్స్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నవకేతన్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది.

    బాణసంచా కేంద్రంలో పేలుడు..7 మంది మృతి

    తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. రంగపాళ్యంలోని ఓ కేంద్రంలో బాణసంచా గోదాములో జరిగిన పేలుళ్ల ఘటనలో ఏడుమంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేశారు. మృతులంతా అక్కడే పనిచేసే కార్మికులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతమందికి గాయాలయ్యాయనే సమాచారం తెలియలేదు.

    అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

    ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలను అదుపు చేశారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. India- A fire broke out in Hotel Galaxy located in the Santacruz area of Mumbai.Three killed, six rescued.#India #mumbai #Fire #accident … Read more

    ఒకే రోజు.. రెండు రైళ్లలో మంటలు

    ఇవాళ రెండు రైళ్లలో అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పుర్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా.. కర్ణాటకలో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుండగా ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలు నిలిపేసి మంటలు ఆర్పారు. అటు బెంగుళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. Just a few minutes of peril between pandhurna and darimeta …. … Read more

    షోరూంలో అగ్ని ప్రమాదం..122 బైకులు దగ్ధం

    [వీడియో:](url) ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని ఓ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 122 బైకులు కాలి బూడిదయ్యాయి. ఓ బైక్ షోరూం హార్డ్‌వేర్ దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పాతవి, కొత్తవి కలిపి దాదాపు 122 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. #fireaccident #AndhraPradeshThere was a huge fire in … Read more

    స్వప్నలోక్ ప్రమాదం కలచి వేసింది; పీఎం మోదీ

    సికింద్రాబాద్‌ స్వప్నలోక్ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు పోవడం తనను బాధించిం దని..గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షిం చారు. ఈ సందర్భంగా స్వప్నలోక్ మృతులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. కాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోయారు.

    అమర్‌రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

    [VIDEO:](url)చిత్తూరు-మోర్దానపల్లె అమర్‌రాజా ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడగా.. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కంపెనీ సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించారు. ? అమర్ రాజా ఫ్యాక్టరీ, యాదమరి మండలం మోర్ధానపల్లె ViDeo : chandu__chowdary#amarraja #fireaccident #chittoor #chittoordistrict pic.twitter.com/nmqwWW3fqS — Chittoor Central (@Chittoorcentral) … Read more

    కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

    [VIDEO:](url) కోల్‌కతాలోని జుప్రీ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు. #WATCH | West Bengal: Massive fire breaks out in Jhupri Market, Kolkata; police and fire tenders … Read more