• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమిళనాడు- కర్ణాటక మధ్య ఉద్రిక్తత

    తమిళనాడు- కర్ణాటక సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరి నది జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బంద్ తలపెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు వరుస ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. https://x.com/appudynasty1/status/1705808522603315601?s=20

    తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేం: సీఎం సిద్దరామయ్య

    తమ రైతులకు నీటి అవసరం ఉన్నందున తమిళనాడుకు నీళ్లు విడుదల చేయలేమని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఈ మేరకు సిద్దరామయ్య కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌కు లేఖ రాశారు. కావేరి బేసిన్‌ ప్రాంతంలోని రైతులు నదీనీటిపైనే అధికంగా ఆధారపడి ఉన్నారని తెలిపారు. దీంతో తమిళనాడుకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 92 రోజుల పాటు తమిళనాడు కావేరి బేసిన్‌లో 100 టీఎంసీ నీటిని వాడుకుందని చెప్పారు.

    మూడేళ్ల బాలుడు అరుదైన ఘనత

    కర్ణాటకకు చెందిన మూడేళ్ల బాలుడు అరుదైన ఘనత సాధించాడు. నేపాల్లో సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తుకు వెళ్లి వచ్చిన అతిచిన్న వయస్కుడిగా నిలిచాడు. దక్షిణ కన్నడ జిల్లా సులియాకు చెందిన జజిల్ రెహ్మాన్ అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఈ ఘనత సాధించాడు. వీరు 19 రోజుల్లో దాదాపు 5 వేల కిలో మీటర్లు ప్రయాణించి ఉద్దాఖలోని ఉమ్లింగ్‌లాకు చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండా, కర్ణాటక జెండా, తలునాడు పతాకాలను ఆవిష్కరించారు

    పెళ్లి భోజనం చేసి.. 150 మందికి అస్వస్థత

    కర్ణాటక బెలగానిలోని ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. పెళ్లి భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వీరందరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. ఫుడ్ శాంపిల్స్, మంచి నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాత దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

    తల్లిని కూడా వదలని దుర్మార్గుడు

    బంగాల్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. హరిదేవ్‌పూర్‌లో ఓ దుర్మార్గుడు కన్న తల్లిపై అత్యాచారం చేశాడు. 65 ఏళ్ల బాధితురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె చిన్న కుమారుడు(33)తో ఉంటోంది. నాలుగేళ్ల క్రితం ఆ కుమారుడు తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. అయితే పరువు పోతుందన్న భయంతో తల్లి ఎవరికీ చెప్పలేదు. తాజాగా మరోమారు హింసాత్మక దాడికి యత్నించడంతో ఆమె భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

    కర్ణాటకలో శునకానికి సీమంతం

    పెంపుడు జంతువులను కన్న బిడ్డలతో సమానంగా సాకడం మనం చూస్తుంటాం. వాటికి నిత్యం సపర్యలు చేస్తూ జంతు ప్రేమికులు పెంచుతుంటారు. అయితే, కర్ణాటకలో ఓ శునకానికి ఏకంగా సీమంతం చేశారు. గదగ్ జిల్లాలో జంతు ప్రేమికుడు అశోక్ తన పెంపుడు జంతువుకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెగ్యులర్‌గా చేసే సీమంతం మాదిరే ఇరుగు పొరుగు వారిని పిలిచి వేడుకలా జరిపించారు. శునకానికి దండ వేసి, బొట్టు పెట్టి, వస్త్రం వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కకు సీమంతం కర్ణాటకలోని గదగ్ జిల్లాలో … Read more

    షాకింగ్‌.. ఎగిరిపడ్డ విద్యార్థినులు

    కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. దీంతో బైకర్‌తో పాటు విద్యార్థులు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు విద్యార్థినులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. A hit & run case has been caught on camera in … Read more

    ట్రెక్కర్లతో గుంజీలు తీయించిన పోలీసులు

    గోవా-క‌ర్నాట‌క బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం చూసేందుకు వచ్చిన ట్రెక్కర్లతో పోలీసు గుంజీలు తీయించారు. జలపాతం చూసేందుకు వచ్చి రైలు నిర్ణీత ప్రదేశానికి చేరక ముందే కొందరు దిగిపోయారు. వారు రైలు పట్టాల వెంట ట్రెక్కింగ్ చేస్తూ పోలీసుల కంటపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని ట్రెక్కింగ్ చేయకూడదన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు వారి చేత గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Railway Police Punish Trekkers at Dudhsagar Waterfall. #Dudhsagar #travel pic.twitter.com/hM94awOmcy — … Read more

    చిరుతను ఎదిరించి.. బంధించిన యువకుడు

    చిరుతను చూస్తేనే భయపడతాం. అలాంటిది దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన ఘటన కర్నాటకలో జరిగింది. పొలానికి వెళ్తుండగా వేణుగోపాల్‌పై చిరుతపులి దాడికి ప్రయత్నించింది. దీంతో ధైర్యం చేసి చిరుతను వెంబడించి బంధించాడు. అనంతరం, తాడుతో బైక్ వెనక్కి చుట్టి ఊర్లోకి తీసుకొచ్చాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. చిరుతను అదుపులోకి తీసుకుని చికిత్స చేయించారు. యువకుడి ధైర్య సాహసాలను గ్రామస్థులు మెచ్చుకున్నారు. దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బందించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన యువకుడు కర్నాటక … Read more

    చిరుతతో పోరాడి తాళ్లతో బైక్‌‌కు కట్టేశాడు

    సినిమాల్లో చూసినట్టే ఓ వ్యక్తి రియల్‌ లైఫ్‌లో చిరుతతో పోరాడి దానిని బంధించాడు. దాన్ని కాళ్లను తాళ్లతో కట్టి బైక్‌పై తీసుకు వెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. ఆ ఘటన కర్ణాటకలో జరిగింది. హసన్ జిల్లా బాగివలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. తప్పించుకునే మార్గం లేక అతడు ఎదురుదాడికి దిగాడు. తన బలాన్ని ప్రయోగించి ఆ చిరుతను బంధించాడు. బైక్‌పై తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. Hassan: A … Read more