• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం

    ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై లారీలో నుంచి గోధుమ బస్తా పడిపోయింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. అంబటి రాజమండ్రి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఈ ప్రమాదంలో జరిగింది. దీంతో ఆయన మరో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

    కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో 12 మంది దుర్మరణం చెందారు. బాధితులు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల వాసులుగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి పొగమంచు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

    ఒకదానికొకటి ఢీకొన్న 158 వాహనాలు

    అమెరికాలోని లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. BREAKING: 7 confirmed DEAD in Louisiana … Read more

    రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

    TS: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ట్రాక్టరుపై కొల్కూరు వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్‌ స్టీరింగ్‌ విరిగింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన మంగలి గోపాల్‌(30), ఈటల రమణ(45), ఎంపల్లి మల్లేశ్‌(30)గా తెలిసింది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

    వైస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    వైస్సార్ జిల్లా- ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్లదుర్తి వద్ద ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో.. లారీని క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొని ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందినవారుగా గుర్తించారు.

    ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి

    యూపీ: లక్నోలో ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఓ యువకుడు లాగాడు. సైకిల్‌ అదుపుతప్పడంతో ఆమెను రెండు బైకులు ఢీకొట్టాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో 17 ఏండ్ల నైన్సీ పటేల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. यूपी के अम्बेडकरनगर में शर्मनाक वारदात। स्कूल … Read more

    సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం

    TS: మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లుగా సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు మృతి మృతుల … Read more

    రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పాఠశాల బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్లో వెళ్తున్న పాఠశాల బస్సు SUV కారును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. If this school bus driver … Read more

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

    మహారాష్ట్ర- బుల్దానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. Horrific accident on Samruddhi highway in #Buldhana 25 … Read more

    కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

    తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్‌ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. దాంతో బైక్‌ ఎగిరి వచ్చి దాని వెనుకాలే వెళ్తున్న ట్రావెలర్‌ వాహనంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో … Read more