బీజేపీ అగ్రనేతలు వరుసగా సినీ తారలను కలుస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. కేవలం ఆర్ఆర్ఆర్లో నటనకు ప్రశంసించేందుకేనని చెప్పినా రాజకీయంగా చర్చ నడిచింది. తాజాగా మళ్లీ నితిన్ను జేపీ నడ్డా కలుస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. నితిన్ నిజామాబాద్ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్. వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్తో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కల్లా పార్టీ ప్రచారంలో సినీ గ్లామర్ను పెంచడమే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే విజయశాంతి పార్టీలో ఉన్నారు. నటి జీవిత యాక్టివ్గా మారుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్తో భేటీ, ఇవాళ నితిన్, మిథాలీ రాజ్తో భేటీని చూస్తే వీరందరినీ ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-
© ANI Photo
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్