తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలకు పైనా సమయం పడుతోంది. వైకుంఠ క్యూకాంప్లెక్సుల్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 68,850 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 21,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం స్వామివారికి హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.