TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సిట్ చెప్పకుండానే ఇద్దరు నిందితులని కేటీఆర్ ఎలా చెప్తారని మండిపడ్డారు. 9 మందిని అరెస్ట్ చేస్తే ఇద్దరే నిందితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసును కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. BRS విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అందుకే ఎగ్జామ్స్ రద్దు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతినోటిఫికేషన్ గందరగోళమేనని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.