• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో కలిసి పనిచేద్దాం: అమిత్‌షా

    తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. నిన్న అమిత్‌షాతో భేటి అయిన పవన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 40 నిమిషాలపాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌ అంగీకరించారని సమాచారం. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం. జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv