• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్

    పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్’. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

    ‘కేసీఆర్‌ వల్లే విశ్వనగరంగా హైదరాబాద్’

    సీఎం కేసీఆర్‌ తీసుకున్న విఫ్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ విశ్వనగరంగా అవతరించిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌలిక వసతుల కల్పన, ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం, హరితహారం వంటి కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌ మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో ఇన్పెక్షన్

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో బాక్టీరియల్ ఇన్పెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    బిల్లా రంగాల్లా కేటీఆర్ హరీష్ దోపిడి: రేవంత్

    టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు బిల్లా రంగాలాగా రాష్ట్రమంతా తిరుగుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ద్వారా 10 వేల ఎకరాల భూమి కాజేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాంట్రాక్టుల జేబులు నింపేందుకే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ఇంకో రెండు నెలల్లో బీఆర్ఎస్ అధికారం ముగిసి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు.

    గాంధీ భవన్‌లోనే గాడ్సే: KTR

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి పంచితే ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సీటుకు 25 కోట్లకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి RSS మనిషి అంటూ కేటీఆర్ విమర్శించారు..

    ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్

    ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మోదీకి ఛాలెంజ్ చేస్తున్న.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే. ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్‌కు లేదు.. ఎన్డీఏలో చేరేందుకు మాకు పిచ్చి కుక్క కరవలేదు. మేం కర్ణాటకలో డబ్బులు పంచితే మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

    మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR

    ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రధాని మోదీ మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…?1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు. 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?? మీ మనసు … Read more

    పాపం కారు గ్యారేజీకి పోతోందన్న భయం: సంజయ్

    మంత్రి కేటీఆర్‌పై మాజీ టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్‌ అయితున్నడు. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు కానీ ఏం ఫాయిదా? తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైంది. వరంగల్‌ డల్లాస్‌ కాలే కనీసం బస్టాండ్‌ కూడా రాలే వరదలు, బురదలు బోనస్ నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే 100 కుటుంబాలు కూడా బాగుపడలే 100 ఏళ్లకు సరిపడా … Read more

    మోదీ స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం: KTR

    జనగర్జన సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే ఎన్నుకుంటారని చెప్పారు. ‘ఎన్డీయేలో చేరేందుకు మాకు పిచ్చికుక్క కరిచిందా? సభలో మోదీ పచ్చి అబద్దాలు చెప్పారు. మునిగిపోయో నావలో ఎవరూ ఎక్కాలనుకోరు. నేను సీఎం కావడానికి మోదీ పర్మీషన్ అవసరం లేదు’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

    ‘భారాస ముమ్మాటికి వారసత్వ పార్టీనే’

    TG: భారాస బరాబర్‌ వారసత్వ పార్టీనే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న వారికి సూర్యాపేట సభలో కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. కానీ, భారాస ఎందరో త్యాగఫలంతో ఏర్పడిన వారసత్వ పార్టీ. కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నారు. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు’ అని కేటీఆర్‌ … Read more