• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిలిచిన రైలు.. ప్రయాణికులు ఆగ్రహం

    సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 4 గంటలుగా రైలు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ధర్మవరం-నర్సాపూర్ ఎక్క్‌ప్రెస్ పట్టాలపై నిలిచిపోయింది. రైలు 4 గంటలకు పైగా నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    మద్యం మత్తులో ప్రయాణికులపై మూత్ర విసర్జన

    మద్యం మత్తులో ఓ వ్యక్తి రైల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సంవర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి ఏసీ కోచ్‌లో పై బెర్త్‌లో పడుకుని ఉన్నాడు. ఈ క్రమంలో లోయర్ బెర్త్‌లో పడుకుని ఉన్న ఇద్దరు దంపతులపై వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు వెంటనే టీటీఈకి సమాచారం అందించారు. నిందితుడిని పట్టుకుని ఓ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు.

    రైలులో హైటెక్ బిచ్చగాడు

    ట్రెండ్‌కు తగ్గట్టుగానే బిచ్చగాళ్లు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లను వినియోగిస్తున్నారు. వాటి ద్వారా డిజిటల్‌ చెల్లింపు చేయాలని అడుక్కుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఓ బిచ్చగాడు రైలులో పాట పాడుతూ క్యూఆర్‌ కోడ్‌తో అడుక్కోవడం కనిపించింది. దృశ్యాలను చేసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. నయా బిచ్చగాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. . #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital paymentA beggar is carrying … Read more

    అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

    ఓ యువకుడు అజాగ్రత్తతో తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ముంబైలో ఉన్న మలాడ్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై ఇద్దరు యువకులు చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా వెనుకనుంచి వచ్చిన ఓ లోకల్ ట్రైన్ మయాంక్(17) అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు ఆమడ దూరంలో పడిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. Mumbai | The accident took place when he was standing to wash a … Read more

    110 కి.మీ వేగంతో రైలు; కింద పడ్డ వ్యక్తి

    యూపీలోని షాజహాన్‌పుర్‌ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్‌ఫాం మీద జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతడికి చిన్నగాయం కూడా కాకపోవడం విశేషం. ఈ ఘటన అనంతరం అతడు లేచి నిలబడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. At Shahjahanpur railway station in Uttar Pradesh, a young … Read more

    రైల్లోంచి దొంగను తోసిన ప్రయాణికుడు; అక్కడికక్కడే మృతి

    ఫోన్ దొంగిలించాడని ఓ ప్రయాణికుడు దొంగను రైల్లోంచి తోసివేయడంతో స్తంభానికి ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీ-అయోధ్య కంటోన్మెంట్ రైలులో చోటుచేసుకుంది. రైలులో ఓ మహిళ తన ఫోన్ కనిపించట్లేదని అరిచింది. దీంతో తోటి ప్రయాణికులు ఓ వ్యక్తి దగ్గర ఫోన్ గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని చితకబాది, ఓ ప్రయాణికుడు రైలు నుంచి తోసివేశాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. The passenger pushed the thief from the train; Died … Read more

    పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు; ట్విస్ట్

    ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. బిహార్‌లోని భాగల్పూర్ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. ఇంతలో ఓ వ్యక్తి ఒక ఫ్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫాంకు వెళ్లాలని పూనుకున్నాడు. ఓవర్ బ్రిడ్జి ఉన్నా.. పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. రైలు కిందకు దూరగానే.. అకస్మాత్తుగా రైలు కదిలింది. దీంతో వెంటనే భయంతో అక్కడే పడుకున్నాడు. రైలు వెళ్లగానే పైకి లేచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. શોર્ટકટના ચક્કરમાં … Read more

    ముంబై టూ అహ్మదాబాద్: ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి ఆసక్తికర విషయాలు

    కళ్లు మూసి తెరిచే‌లోపు రయ్‌మంటూ దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే ఠక్కున గుర్తొచ్చే ఆన్సర్ జపాన్. కానీ జపాన్ కంటే మనం త‌క్కువేమి కాదని భారత్ ఓ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుంది. ఇంతకి ఆ ప్రాజెక్టు విశేషాలు ఏంటి..? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ట్రైన్ నడుస్తుంది లాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోండి. ప్రాజెక్టు విషయాలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుంచి మహరాష్ట్ర‌లోని ముంబై వరకు ఈ బుల్లెట్ ట్రైన్ నడువనుంది. ముంబై- అహ్మదాబాద్ హై … Read more