బుల్లితెర యాంకర్ & నటి అనసూయ భరద్వాజ్ మరోమారు గ్లామర్ ఫొటోలతో తళుక్కుమంది. హాఫ్ జాకెట్లో సింధూర పువ్వులా మెరిసిపోయింది.
ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించిన అనసూయ.. మతులు పోగెట్టో ఫోజులతో అలరించింది.
సోఫాలో పడుకొని అందాల విందు చేసింది. హాట్ హాట్ స్టిల్స్తో ఆకట్టుకుంది.
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 – 2022 మధ్య బుల్లితెర యాంకర్గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్లో అనసూయ న్యూస్ రీడర్గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. ప్రస్తుతం పుష్ప2 చిత్రంలోనూ ఈ భామ నటిస్తోంది.
తాజాగా విమానం సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్లో అనసూయ బిజీబిజీగా గడుపుతోంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్