• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivek Ramaswamy: అమెరికాలో దూసుకెళ్తున్న వివేక్‌ రామస్వామి.. ఆయన గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    అమెరికాలో భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) పేరు మార్మోగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున వివేక్‌ అధ్యక్ష బరి పోటీలో ఉన్నారు. మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత సంతతి మహిళ నిక్కీ హేలితో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్‌ తలపడుతున్నారు. దీంతో రోజు సరికొత్త ప్రకటనలతో, ప్రసంగాలతో వివేక్‌ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.  తాజాగా వివేక్‌ తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్​1బీ వీసా లాంటి లాటరీ ఆధారిత … Read more

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    Karnataka Elections: సిద్ధరామయ్య VS డీకే శివకుమార్‌.. సీఎం సీటు కోసం అగ్రనేతలు పోటీ..!

    కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు గెలుపు మాదంటే మాది అని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. అయితే భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ఇటీవల విడుదలైన పలు సర్వేలు కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.  DK శివకుమార్‌ vs సిద్ధరామయ్య కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థుల జాబితాలో ప్రధానంగా రెండు పేర్లు … Read more

    Telangana Young Leaders: తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలను శాసించనున్న యువనేతలు వీరే!

    ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఎంతో మంది రాజకీయ నేతలు దేశ రాజకీయాలను శాసించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన P.V నరసింహారావు ఏకంగా దేశానికి ప్రధానిగా చేసి అనేక సంస్కరణలకు నాంది పలికారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేతలంతా ఒకప్పుడు యువనేతలుగా రాణించినవారే. ఈ నేపథ్యంలో పలువురు యువనేతలు తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నారు. తమ తల్లి తండ్రుల నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకొని గొప్ప నేతలుగా ఎదిగేందుకు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర … Read more

    AP Young Leaders: ఏపీ భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పే యువనేతలు వీరే..!

    ఏ రంగమైన కొత్త పుంతలు తొక్కాలంటే యువత ఎంతో కీలకం. ఇందుకు రాజకీయాలేమి మినహాయింపు కాదు. ప్రస్తుతం గొప్ప నేతలుగా కీర్తి గడించిన వారంతా ఒకప్పుడు యూత్‌ లీడర్స్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై తమదైన ముద్ర వేసేందుకు కొందరు యువనేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడటంతో పాటు, తమ నియోజక వర్గం సమస్యలను తీర్చేందుకు నడుం బిగిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్నారు. TDP, YSRCP పార్టీలో ఉన్న ఆ యువనేతలు ఎవరో ఇప్పుడు … Read more

    Rahul Gandhi: అనర్హత వేటు నుంచి రాహుల్ తప్పించుకోగలడా? కేసులో శిక్షపడినా ఎంపీగా కొనసాగే అవకాశం ఉందా? 

    దేశమంతా ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించే చర్చిస్తోంది. పరువు నష్టం కేసులో ఆయన్ని కోర్టు దోషిగా తేల్చటం, రెండేళ్లు జైలు శిక్ష విధించడం… తీర్పు వచ్చిన 24 గంటల్లోనే ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏం చేయనున్నారు? సభ్యత్వం రద్దు రాజ్యాంగబద్ధమేనా? పైకోర్టుకి వెళ్తే అనర్హత వేటు తొలిగిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం. అసలేం జరిగింది? ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును ఉద్దేశించి గతంలో రాహుల్‌ గాంధీ 2019లో వ్యాఖ్యలు … Read more

    కవిత, ED రోజంతా నాటకీయ పరిణామాలు-మళ్లీ నోటీసులు

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌… విచారణకు హాజురు కాలేనన్న కవిత విజ్ఞప్తిని అంగీకరించి మరో తేదీని ఖరారు చేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, ఇప్పటివరకు ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ… ఇప్పుడు అనుమానితురాలిగా పేర్కొంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు డుమ్మా ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు విచారణ … Read more

    రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు.  రూ.3000 పింఛన్ … Read more

    రాహుల్‌ గాంధీ ‘పరుగో పరుగు’

    వీలు చిక్కినప్పుడల్లా హుషారుగా ఉండే రాహుల్‌ గాంధీ..భారత్‌ జోడో యాత్రలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో ఐదోరోజు కొనసాగిన పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో కలిసి పరిగెత్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు తీశారు. రాహుల్‌ ఉన్నపలంగా పరిగెత్తటంతో ఏమవుతుందో తెలీక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆయన వెంబడి పరుగులు తీశారు. చిన్నారులతో సరదాగా చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. Out for a marathon, but let's sprint! ?‍♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA — Bharat Jodo (@bharatjodo) October … Read more

    గుజరాత్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్: పల్లా

    కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. గుజరాత్ మోడల్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్ ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. రైతన్నలకు కేంద్రం ఏ మేలూ చేయలేదని ఆయన ఆరోపించారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఆయన అన్నారు. రైతన్నలు కేసీఆర్ ని కలవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రజలు దీవిస్తే.. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం త్వరలోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రజల కోరిక అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్ లో పల్లా ఈ … Read more