• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి పదవి కోసం లక్ష్మీ పార్వతి వడ్డాణం అడిగారు: ఎర్రబెల్లి

    తెరాస మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఒకప్పు తెదేపా నేత. ఎన్టీఆర్‌కు చాలా సన్నిహితుడిగా ఉండేవారు. అయితే గతంలో తనకు ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇస్తానని చెప్పినపుడు లక్ష్మీపార్వతి వడ్డాణం అడిగారని చెప్పారు. ‘ మా పెళ్లికి వ్యతిరేకించినా నీకు మంత్రి పదవి ఇప్పిస్తున్నాను. నాకు వడ్డాణం కొనివ్వాలి’ అని లక్ష్మీ పార్వతి చెప్పారని ఇటీవల ఓపెన్‌ హార్ట్‌ విత్‌ RK కార్యక్రమంలో ఎర్రబెల్లి పంచుకున్నారు.

    దేశవ్యాప్తంగా కాక రేపుతున్న అమిత్‌ షా, ఎన్టీఆర్ భేటీ

    ఆదివారం తెలంగాణలో అమిత్‌ షా పర్యటనలోని కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే ఎన్టీఆర్‌తో భేటీ మరో ఒక ఎత్తు. కేవలం సినిమాలో నటనకు అభినందించడానికేనంటూ పిలిచినా రాజకీయంగా ఈ సమావేశం రచ్చ లేపుతోంది. ఎన్టీఆర్‌ను బీజేపీ ప్రచార అస్త్రంగా వాడుకోవడానికేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. భేటీ తర్వాత అనేక మంది స్పందనలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.  వాస్తవానికి అమిత్‌ షా టూర్‌ ప్లాన్‌లో తొలుత ఎన్టీఆర్ లేడు. కానీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు రేకెత్తించింది. భాజపా తెలంగాణ … Read more

    ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ

    హైదరాబాద్‌ నొవాటెల్‌లో ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ అయ్యారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సినిమా చూసిన అమిత్‌ షా, ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజకీయంగానూ ఈ భేటీ ఆసక్తిని పెంచుతోంది.

    ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం’ బీజేపీ మాజీ ఎమ్మెల్యే

    రాజస్థాన్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్ఞాన్‌దేవ్‌ ఓ సమావేశంలో కూర్చుని మాట్లాడుతూ ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం. గోవులను చంపేవారిని విడిచిపెట్టేది లేదు.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు గుప్పిస్తూ… ‘బిల్కిస్ బానో దోషులకు సత్కారం చేసిన వారిని రాజస్థాన్‌ పంపించండి, ఆ ఎమ్మెల్యేకు కూడా సత్కారం చేయించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యల [వీడియో](url) సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. Rajasthan BJP Ex MLA Gyan Dev … Read more

    బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. జనగామ జిల్లా దేవరుప్పలలో తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. దేవరుప్పల బహిరంగ సభలో మాట్లాడుతూ బండి సంజయ్‌ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో కేంద్రంలో ఏం ఉద్యోగాలు ఇచ్చారంటూ తెరాస కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి దాడులకు దారితీసింది. పలువురికి గాయాలు కాగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

    గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు

    ఫ్రీడమ్ ర్యాలీలో గన్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్‌తో కాల్చడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పోలీసులకు చెందిన వెపన్‌తో మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేంటని మండిపడుతున్నారు. [వీడియో](url) Trs minister open fire during tiranga rally,police behaving like audience and applauding.will @TelanganaDGP take any action or rules are only for common people.#SrinivasGoud pic.twitter.com/Id5yGyDy3b — Raghav … Read more

    మునుగోడు కోసం పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు… టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి?

    మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసేంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల21న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.దీంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలవనున్నట్లు తేలిపోయింది. అటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టి బరిలో నిలిచి గెలిచే బలమైన … Read more

    బండి సంజయ్  పాదయత్రతోనే ఆపరేషన్ ఆకర్ష్.. లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు?

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన, పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర వరంగల్ భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈ యాత్ర భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. 24 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 26న వరంగల్ లో ముగియనుంది. ఈ పాదయాత్రనే వేదికగా చేసుకుని ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేలా … Read more

    కాంగ్రెస్ నేత జ‌ట్టు ప‌ట్టుకొని లాగిన పోలీసులు.. వీడియో వైర‌ల్

    నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ రెండోసారి విచారిస్తున్న నేప‌థ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఈడీ విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బి.వి జుట్టు ప‌ట్టుకొని లాగిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై … Read more

    చిన్నారికి పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం జగన్

    AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పెదపూడి లంకలో వరద బాధితులతో సీఎం జగన్ ఓ చిన్నారిని ఎత్తుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. ఆ పెన్ విలువ రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వీడియో … Read more