జియాగూడ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులని పోలీసులు నిర్ధారించారు. అక్షయ్, సోనూ, టిల్లూ అనే ముగ్గురు యువకులు జంగం సాయినాథ్ను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కోఠికి చెందిన సాయినాథ్ను ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై [హత్య](url) చేసిన సంగతి తెలిసిందే. వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపి మూసీ నదిలో దూకి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.