• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డు ప్రమాదం.. ముగ్గరు మృతి

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్‌ప్లాజా వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉంది.

    రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు మృతి

    TS: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంnలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి తన ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా ఓ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

    రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతి

    ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉపాధ్యాయులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్నవాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.

    తెల్లవారుజామున ఘోర విషాదం

    మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in … Read more

    బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య

    TS: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చావును కొని తెచ్చుకున్నాడు. కదులుతున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి వెనక చక్రాల కిందికి దూరాడు. చాకచక్యంగా డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ శరీరంపైకి కొద్దిమేర టైర్ ఎక్కింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా ధ్రువీకరించారు. బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య … Read more

    రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు

    బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. అలా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్‌ఎంసీ అధికారి బాలచందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. #WATCH | Telangana | Hit and run incident … Read more

    కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం

    [వీడియో:](url) కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు పెను ప్రమాదం తప్పింది. జమ్ము కశ్మీర్‌లోని రంబన్ జిల్లా బనిహాల్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది కారు డోర్లు తెరచి మంత్రిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. కాగా మంత్రి కిరణ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. जम्मू कश्मीर के रामबन … Read more

    హైవేపై 3 కంటైనర్లు ఢీ.. ఎగసిపడ్డ మంటలు

    [VIDEO](url): మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై మూడు కంటైనర్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కాగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ముంబయి వైపు వెళ్తున్న కంటైనర్‌ బ్రేకులు ఫెయిలై పక్కనున్న రోడ్దులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు లారీలను ఢీకొట్టింది. అనంతరం హైవేపై బోల్తాపడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది. Two heavy vehicles collided near Ganesh Ghat before catching fire. #dhar … Read more

    గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. జనం పరుగులు

    రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్‌లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై అక్కడినుంచి పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అబ్దుల్లాపూర్ మెట్ సర్కిల్ వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో స్థానికులు కంగారు పడ్డారు. మరోవైపు, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్‌ని పక్కకు తొలగించేందుకు సిబ్బందితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్‌ ట్యాంకర్‌ … Read more

    బైక్‌ను ఢీకొట్టిన కారు.. గోతిలో పడిన మహిళ

    తరచూ ఎదో ఒకటి వైరల్ అయ్యే సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ మహిళా కిందపడి దొర్లుకుంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన గోతిలో పడిపోయింది. అది గమనించిన అక్కడి స్థానికులు ఆమెను బయటికి తీసి.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/leodikc/status/1568686672086441985?s=20&t=JK73-VNgJfsoZpgJ3h_0hg